పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా కాజల్ అగర్వాల్ కు అవకాశాలు వస్తున్నాయి. వివాహానికి ముందే కమల్ హాసన్ ఇండియన్ 2 ఒప్పుకోవడంతో ప్రస్తుతం దాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో కూడా తనే కథానాయిక. అఫీషియల్ గా ఇంకో వారం పది రోజుల్లో ప్రకటన రావొచ్చు. ఇదిలా ఉండగా తన కొత్త సినిమా ఒకటి గుట్టుచప్పుడు కాకుండా రిలీజ్ కు రెడీ కావడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఘోస్టీ టైటిల్ తో రూపొందిన ఈ కామెడీ హారర్ డ్రామాని ఇవాళ తమిళంలో విడుదల చేశారు. వారం తర్వాత తెలుగు డబ్బింగ్ రాబోతోంది.
ఇందులో కాజల్ అగర్వాల్ పోలీస్ అధికారిగా నటిస్తోంది. కొందరు షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు తమ చిత్రంలో నటించమని అడిగితే ఒప్పుకున్న కాజల్ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఒకరిని కాల్చడం వల్ల హత్యకు కారణమవుతుంది. ఆ చనిపోయిన వ్యక్తి దెయ్యం రూపంలో ఆమె వెంట పడుతూ ఇంటికి వచ్చేస్తాడు. దీంతో అక్కడి నుంచి కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇంతకీ ఈ మర్డర్ ఎలా జరిగింది ఆ ఆత్మ ఎందుకు కాజల్ చుట్టూ తిరిగిందనే పాయింట్ మీద ఘోస్టీ రూపొందింది. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో యోగిబాబు, ఊర్వశి, ఆడుకాలం నరేన్ లాంటి పెద్ద అరవ క్యాస్టింగ్ ఉంది.
అంతా బాగానే ఉంది కానీ ఇంత హఠాత్తుగా ప్రమోషన్లకు కనీస టైం తీసుకోకుండా రిలీజ్ చేయడమే కామెడీగా ఉంది. తమిళంలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. బాక్సాఫీస్ చాలా డల్ గా ఉంది. గత వారం వచ్చిన జయం రవి అగిలన్ డిజాస్టర్ అయ్యింది. ధనుష్ వాతి ఎప్పుడో నెమ్మదించేసింది. అందుకే ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకుందామని హఠాత్తుగా బరిలో దూకేసింది. రిపోర్ట్స్ సైతం ఏమంత ఆశాజనకంగా లేవు. మరి వచ్చేవారం టాలీవుడ్ లో విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ, కృష్ణవంశీ రంగమార్తాండలను కాచుకోవాల్సి ఉంటుంది. అసలు ఇందులో హీరోనే లేకపోవడం ఫైనల్ ట్విస్టు
This post was last modified on March 17, 2023 10:09 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…