90వ దశకంలో అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రల్లో మెరిసిన పొన్నాంబళంను అంత సులువుగా మరిచిపోలేం. మరీ లెంగ్త్ ఉన్న, ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయలేదు కానీ.. హీరోను ఢీకొట్టే రౌడీ పాత్రల్లో పొన్నాంబళం మంచి గుర్తింపే సంపాదించాడు. చూడటానికి చాలా క్రూరంగా కనిపించే పొన్నాంబళంను చూసి అప్పటి ప్రేక్షకులు జడుసుకునేవారు. అతడి పాత్రలు కూడా అలా ఉండేవి మరి.
తెర మీద ఇలా క్రూరంగా కనిపించేవాళ్లు చాలామంది బయట సున్నిత మనస్కులుగా ఉంటారు. పొన్నాంబళం కూడా అందుకు మినహాయింపు కాదు. బయట ఆయన మాట తీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్రస్తుతం పొన్నాంబళం తెలుగు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. ఈ మధ్య పొన్నాంబళం కిడ్నీ వ్యాధితో విషమ స్థితికి చేరగా.. అత్యవసర స్థితిలో చిరు సాయంతో కోలుకున్నట్లుగా వార్తలొచ్చాయి.
దీని గురించి పొన్నాంబళం చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సాయం కోరుతూ మెసేజ్ పెడితే లక్షో రెండు లక్షలో ఇస్తారనుకుంటే.. తన కోడలు ఉపాసన పుట్టింటి వారు నడిపే అపోలో ఆసుపత్రిలో తనను చేర్పించి 40-45 లక్షలు ఖర్చుతో వైద్యం చేయించి మొత్తం బిల్లు చిరునే కట్టిన విషయాన్ని పొన్నాంబళం వెల్లడించడంతో మెగాస్టార్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇదిలా ఉండగా.. తాను తీవ్ర అనారోగ్యం పాలవడానికి బయట అనుకుంటున్న కారణాలు నిజం కాదని పొన్నాంబళం ఈ ఇంటర్వ్యూలోనే వెల్లడించాడు. అందరూ తాను మద్యం తాగి కిడ్నీలు పాడు చేసుకున్నట్లు భావిస్తున్నారని.. తన మీద విష ప్రయోగం జరగడం వల్ల కిడ్నీలు పాడయ్యాయని అతను తెలిపాడు. తన తండ్రికి నలుగురు భార్యలని.. అందులో ఒక భార్య కొడుకు తన దగ్గరే మేనేజర్గా పని చేసేవాడని.. సొంత తమ్ముడే కదా అని అతణ్ని ఎంతో నమ్మానని.. కానీ అతను తాను తాగే బీర్లో స్లో పాయిజన్ కలిపి తన ఆరోగ్యం దెబ్బ తినేలా చేశాడని.. ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పొన్నాంబళం వెల్లడించాడు.
This post was last modified on March 16, 2023 2:01 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…