90వ దశకంలో అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రల్లో మెరిసిన పొన్నాంబళంను అంత సులువుగా మరిచిపోలేం. మరీ లెంగ్త్ ఉన్న, ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయలేదు కానీ.. హీరోను ఢీకొట్టే రౌడీ పాత్రల్లో పొన్నాంబళం మంచి గుర్తింపే సంపాదించాడు. చూడటానికి చాలా క్రూరంగా కనిపించే పొన్నాంబళంను చూసి అప్పటి ప్రేక్షకులు జడుసుకునేవారు. అతడి పాత్రలు కూడా అలా ఉండేవి మరి.
తెర మీద ఇలా క్రూరంగా కనిపించేవాళ్లు చాలామంది బయట సున్నిత మనస్కులుగా ఉంటారు. పొన్నాంబళం కూడా అందుకు మినహాయింపు కాదు. బయట ఆయన మాట తీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్రస్తుతం పొన్నాంబళం తెలుగు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. ఈ మధ్య పొన్నాంబళం కిడ్నీ వ్యాధితో విషమ స్థితికి చేరగా.. అత్యవసర స్థితిలో చిరు సాయంతో కోలుకున్నట్లుగా వార్తలొచ్చాయి.
దీని గురించి పొన్నాంబళం చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సాయం కోరుతూ మెసేజ్ పెడితే లక్షో రెండు లక్షలో ఇస్తారనుకుంటే.. తన కోడలు ఉపాసన పుట్టింటి వారు నడిపే అపోలో ఆసుపత్రిలో తనను చేర్పించి 40-45 లక్షలు ఖర్చుతో వైద్యం చేయించి మొత్తం బిల్లు చిరునే కట్టిన విషయాన్ని పొన్నాంబళం వెల్లడించడంతో మెగాస్టార్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇదిలా ఉండగా.. తాను తీవ్ర అనారోగ్యం పాలవడానికి బయట అనుకుంటున్న కారణాలు నిజం కాదని పొన్నాంబళం ఈ ఇంటర్వ్యూలోనే వెల్లడించాడు. అందరూ తాను మద్యం తాగి కిడ్నీలు పాడు చేసుకున్నట్లు భావిస్తున్నారని.. తన మీద విష ప్రయోగం జరగడం వల్ల కిడ్నీలు పాడయ్యాయని అతను తెలిపాడు. తన తండ్రికి నలుగురు భార్యలని.. అందులో ఒక భార్య కొడుకు తన దగ్గరే మేనేజర్గా పని చేసేవాడని.. సొంత తమ్ముడే కదా అని అతణ్ని ఎంతో నమ్మానని.. కానీ అతను తాను తాగే బీర్లో స్లో పాయిజన్ కలిపి తన ఆరోగ్యం దెబ్బ తినేలా చేశాడని.. ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పొన్నాంబళం వెల్లడించాడు.
This post was last modified on March 16, 2023 2:01 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…