‘రన్ రాజా రన్’ సినిమాతో వావ్ అనిపించాడు యువ దర్శకుడు సుజీత్. కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో.. ఏ దర్శకుడి దగ్గరా అసిస్టెంట్గా పని చేయకుండానే.. 24 ఏళ్ల వయసులోనే తొలి సినిమాను డైరెక్ట్ చేయడమే కాక.. దాన్ని పెద్ద హిట్ చేసి ఆశ్చర్యపరిచాడు.
ఇందుకు పెద్ద ప్రతిఫలమే దక్కింది.
‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ మెగా ప్రాజెక్టును డీల్ చేయడంలో అతను తడబడ్డాడు. దీంతో కెరీర్ తిరగబడింది. మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారింది.
దీంతో జంక్షన్లో వచ్చి నిలబడ్డాడు. ఐతే ఇబ్బందుల్లో ఉన్న అతణ్ని ప్రభాసే ఆదుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్లోనే అతను తన తర్వాతి చిత్రాన్ని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం.
ప్రభాస్కు ఇండస్ట్రీలో అత్యంత ఆప్త మిత్రుల్లో ఒకడైన గోపీచంద్.. సుజీత్ కొత్త సినిమాలో హీరోగా నటించనున్నాడట. ఇందులో మరో హీరో కూడా నటిస్తాడని అంటున్నారు కానీ.. అదెంత వరకు నిజమో తెలియదు. గోపీచంద్ అయితే ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. గోపీ ఇంతకుముందు యువి బేనర్లోనే ‘జిల్’ అనే సినిమా చేశాడు. దానికి మంచి రివ్యూలు వచ్చినా.. అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఓవర్ బడ్జెట్ సమస్య అయింది. దాని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రస్తుతం యువి బేనర్లోనే ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా సుజీత్ దెబ్బ తిన్నాడు. గోపీ మార్కెట్ కూడా పడిపోయింది.
ఈ నేపథ్యంలో పరిమిత బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం గోపీ ‘సీటీమార్’ చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో ‘అలివేలు మంగ’లోనూ నటించాల్సి ఉంది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…