ఎంత స్టార్ అయినా సరే తన సినిమాలను ప్రేక్షకులు మరీ దారుణంగా తిరస్కరిస్తుండటంతో అక్షయ్ కుమార్ కి జ్ఞానం బోధపడినట్టు ఉంది. థియేటర్ కు వర్కౌట్ కావని తెలిసిన సినిమాలను నేరుగా ఓటిటి రిలీజ్ కు ఇచ్చేలా నిర్మాతలను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ఇతను నటిస్తున్న ఓ మై గాడ్ 2 ని డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఫైనల్ చేశారట. మొదటి భాగం తెలుగులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో గోపాల గోపాలగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడలో ఉపేంద్ర సుదీప్ లు నటించారు. అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది కానీ ఒరిజినల్ మాత్రం క్లాసిక్ అయ్యింది.
ఫస్ట్ పార్ట్ లో అక్షయ్ పరేష్ రావల్ ల నటన అద్భుతంగా పండటంతో పాటు అందులోని డ్రామా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యింది. ఆ నమ్మకంతోనే రెండో భాగాన్ని మొదలుపెట్టారు. ఈసారి కృష్ణుడి పాత్రను శివుడిగా మార్చేశారు. కథ కూడా కొత్తదే. కొనసాగింపు కాదు. ఈ హక్కులను టైఅప్ తో ఒకే బ్రాండ్ గా మారబోతున్న జియో సినిమా ఊట్ లు సంయుక్తంగా కొనుగోలు చేశాయని ముంబై టాక్. ఎంత మొత్తానికి అనేది బయటికి రాలేదు కానీ చాలా క్రేజీ ఆఫర్ అయితే ఇచ్చారట. గతంలో అక్షయ్ కుమార్ కట్ పుత్లీ, లక్ష్మి బాంబ్, ఆత్ రంగీరే లు నేరుగా స్మార్ట్ స్క్రీన్ పై వచ్చాయి.
ఈ లెక్కన ఇప్పుడీ సీక్వెల్ నిజంగా బాగున్నా రీమేక్ అవకాశాలు లేనట్టే. ఎందుకంటే నేరుగా యాప్ లో కోట్లాది ఆడియన్స్ చూసేస్తారు కాబట్టి ఎంతలేదన్నా ఆసక్తి తగ్గిపోతుంది. ఓ మై గాడ్ 2 ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందట. రెండు నెలల క్రితం అజయ్ దేవగన్ థాంక్ యు గాడ్ వచ్చింది. ఫ్లాప్ అయ్యింది. లైన్ పరంగా కొంచెం పోలికలు వచ్చే అవకాశం ఉండటంతో ఫైనల్ గా ఓటిటికే మొగ్గు చూపారని తెలిసింది. పారితోషికాలు వస్తున్నాయి ఒంట్లో శక్తి ఉందని వరసగా సినిమాలు చేసుకుంటూ పోతే ఇదిగో ఇలాంటి షాకులే తగులుతాయి.
This post was last modified on March 16, 2023 11:49 am
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…