శాండల్ వుడ్ టాప్ స్టార్స్ ముగ్గురు ఉపేంద్ర – కిచ్చ సుదీప్ – శివరాజ్ కుమార్ కలిసి నటించిన ప్యాన్ ఇండియా మూవీ అది కూడా నూటా ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందినప్పుడు దాని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉండాలి. ఏదో ఆషామాషీ కమర్షియల్ సినిమా అయితే ఏమోలే అనుకోవచ్చు. కానీ పీరియాడిక్ డ్రామాగా రూపొందిన కబ్జా విషయంలో అలాంటి హడావిడి కనిపించడం లేదు. కెజిఎఫ్ రేంజ్ లో ట్రైలర్ లో బిల్డప్ గట్రా ఉన్నప్పటికీ ఎందుకో మరి ఆడియన్స్ దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. ప్రధాన నగరాలు మొదలుకుని అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ నీరసంగా ఉన్నాయి.
ఉపేంద్ర అంతా తానై అన్ని చోట్ల తిరుగుతున్నాడు. తెలుగులో సాంగ్ లాంచ్, ప్రెస్ మీట్ అన్నీ చేశాడు. ప్రతి చోటా హీరోయిన్ శ్రేయ వెన్నంటే ఉంది. చెన్నైకు వెళ్లి తమిళంలో మాట్లాడి అక్కడి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ విచిత్రంగా కిచ్చ సుదీప్ మాత్రం దేనికీ రాలేదు. తనది ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రే. శివ రాజ్ కుమార్ ది ఫుల్ లెన్త్ కాకపోయినా క్యామియోగానే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. స్వాతంత్ర సమరం జరుగుతున్న కాలంలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం వదిలేసి గ్యాంగ్ స్టర్ గా మారిన ఒక వ్యక్తి కథగా కబ్జాని తెరకెక్కించారు.
దర్శకుడు చంద్రుకి కన్నడలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇతని చివరి చిత్రం 2019లో వచ్చిన ఐ లవ్ యు. ఇందులో కూడా ఉపేంద్రనే హీరో. ఆ తర్వాత నుంచి పూర్తిగా కబ్జా మీద పని చేస్తున్నాడు. కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. పోనీ కర్ణాటకలో భీభత్సమైన ప్రీ హైప్ ఉందా అంటే ప్రస్తుతానికి కనిపించడం లేదు. బెంగళూరు ఫస్ట్ డే టికెట్లు సులభంగానే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వాటికి వేసే తెల్లవారుఝాము షోలు ఇంకా ప్లాన్ చేయలేదు. ఉపేంద్ర పడిన ఇంత పెద్ద కష్టానికైనా కబ్జా ఏదో అద్భుతం చేయాల్సిందే.
This post was last modified on March 14, 2023 4:27 pm
ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు…
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 18 కీలక ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు,…