శాండల్ వుడ్ టాప్ స్టార్స్ ముగ్గురు ఉపేంద్ర – కిచ్చ సుదీప్ – శివరాజ్ కుమార్ కలిసి నటించిన ప్యాన్ ఇండియా మూవీ అది కూడా నూటా ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందినప్పుడు దాని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉండాలి. ఏదో ఆషామాషీ కమర్షియల్ సినిమా అయితే ఏమోలే అనుకోవచ్చు. కానీ పీరియాడిక్ డ్రామాగా రూపొందిన కబ్జా విషయంలో అలాంటి హడావిడి కనిపించడం లేదు. కెజిఎఫ్ రేంజ్ లో ట్రైలర్ లో బిల్డప్ గట్రా ఉన్నప్పటికీ ఎందుకో మరి ఆడియన్స్ దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. ప్రధాన నగరాలు మొదలుకుని అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ నీరసంగా ఉన్నాయి.
ఉపేంద్ర అంతా తానై అన్ని చోట్ల తిరుగుతున్నాడు. తెలుగులో సాంగ్ లాంచ్, ప్రెస్ మీట్ అన్నీ చేశాడు. ప్రతి చోటా హీరోయిన్ శ్రేయ వెన్నంటే ఉంది. చెన్నైకు వెళ్లి తమిళంలో మాట్లాడి అక్కడి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ విచిత్రంగా కిచ్చ సుదీప్ మాత్రం దేనికీ రాలేదు. తనది ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రే. శివ రాజ్ కుమార్ ది ఫుల్ లెన్త్ కాకపోయినా క్యామియోగానే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. స్వాతంత్ర సమరం జరుగుతున్న కాలంలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం వదిలేసి గ్యాంగ్ స్టర్ గా మారిన ఒక వ్యక్తి కథగా కబ్జాని తెరకెక్కించారు.
దర్శకుడు చంద్రుకి కన్నడలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇతని చివరి చిత్రం 2019లో వచ్చిన ఐ లవ్ యు. ఇందులో కూడా ఉపేంద్రనే హీరో. ఆ తర్వాత నుంచి పూర్తిగా కబ్జా మీద పని చేస్తున్నాడు. కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. పోనీ కర్ణాటకలో భీభత్సమైన ప్రీ హైప్ ఉందా అంటే ప్రస్తుతానికి కనిపించడం లేదు. బెంగళూరు ఫస్ట్ డే టికెట్లు సులభంగానే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వాటికి వేసే తెల్లవారుఝాము షోలు ఇంకా ప్లాన్ చేయలేదు. ఉపేంద్ర పడిన ఇంత పెద్ద కష్టానికైనా కబ్జా ఏదో అద్భుతం చేయాల్సిందే.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…