శాండల్ వుడ్ టాప్ స్టార్స్ ముగ్గురు ఉపేంద్ర – కిచ్చ సుదీప్ – శివరాజ్ కుమార్ కలిసి నటించిన ప్యాన్ ఇండియా మూవీ అది కూడా నూటా ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందినప్పుడు దాని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉండాలి. ఏదో ఆషామాషీ కమర్షియల్ సినిమా అయితే ఏమోలే అనుకోవచ్చు. కానీ పీరియాడిక్ డ్రామాగా రూపొందిన కబ్జా విషయంలో అలాంటి హడావిడి కనిపించడం లేదు. కెజిఎఫ్ రేంజ్ లో ట్రైలర్ లో బిల్డప్ గట్రా ఉన్నప్పటికీ ఎందుకో మరి ఆడియన్స్ దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. ప్రధాన నగరాలు మొదలుకుని అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ నీరసంగా ఉన్నాయి.
ఉపేంద్ర అంతా తానై అన్ని చోట్ల తిరుగుతున్నాడు. తెలుగులో సాంగ్ లాంచ్, ప్రెస్ మీట్ అన్నీ చేశాడు. ప్రతి చోటా హీరోయిన్ శ్రేయ వెన్నంటే ఉంది. చెన్నైకు వెళ్లి తమిళంలో మాట్లాడి అక్కడి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ విచిత్రంగా కిచ్చ సుదీప్ మాత్రం దేనికీ రాలేదు. తనది ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రే. శివ రాజ్ కుమార్ ది ఫుల్ లెన్త్ కాకపోయినా క్యామియోగానే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. స్వాతంత్ర సమరం జరుగుతున్న కాలంలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం వదిలేసి గ్యాంగ్ స్టర్ గా మారిన ఒక వ్యక్తి కథగా కబ్జాని తెరకెక్కించారు.
దర్శకుడు చంద్రుకి కన్నడలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇతని చివరి చిత్రం 2019లో వచ్చిన ఐ లవ్ యు. ఇందులో కూడా ఉపేంద్రనే హీరో. ఆ తర్వాత నుంచి పూర్తిగా కబ్జా మీద పని చేస్తున్నాడు. కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. పోనీ కర్ణాటకలో భీభత్సమైన ప్రీ హైప్ ఉందా అంటే ప్రస్తుతానికి కనిపించడం లేదు. బెంగళూరు ఫస్ట్ డే టికెట్లు సులభంగానే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వాటికి వేసే తెల్లవారుఝాము షోలు ఇంకా ప్లాన్ చేయలేదు. ఉపేంద్ర పడిన ఇంత పెద్ద కష్టానికైనా కబ్జా ఏదో అద్భుతం చేయాల్సిందే.
This post was last modified on March 14, 2023 4:27 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…