కోట్లాది భారతీయ సినిమా ప్రేమికుల ఆకాంక్షలు ప్రార్థనలు ఫలించాయి. ఆస్కార్ కు అధికారికంగా నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకుగాను సగర్వంగా అకాడెమి పురస్కారం దక్కించుకుంది. దీనికన్నా ముందు హోరెత్తే కరతాళ ధ్వనుల మధ్య వివిధ దేశాలకు చెందిన డాన్సర్లు స్టేజి మీద నాటు నాటుకి లైవ్ లో పెర్ఫార్మ్ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవల లయబద్ధ గాత్రానికి అలా నృత్యాలు చేస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలలేదంటే అతిశయోక్తి కాదు. పాట పూర్తవ్వగానే స్టాండింగ్ ఒవేషన్ రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.
దీనికి ముందు దీపికా పదుకునే ఇచ్చిన వ్యాఖ్యానం, ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల నేపథ్యం గురించి ఉదహరించిన తీరు గొప్పగా సాగింది. ఉదయం అయిదు గంటల నుంచే టీవీ సెట్ల ముందు అతుక్కుపోయిన అభిమానులు మూడు గంటలకు పైగా నాటు నాటు అనౌన్స్ మెంట్ కోసం ఓపిగ్గా ఎదురు చూశారు. ఆ క్షణం రానే వచ్చింది. దర్శకుడు, నటీనటులు, సినిమా, సాంకేతిక విభాగం ఇలా ఎన్నిటి మీదో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఫైనల్ గా నాటు నాటుకి మాత్రమే నామినేషన్ దక్కడం కొంత లోటుగా అనిపించినా ఎందరో మహామహుల వల్ల కానిది రాజమౌళి సాధ్యం చేసి చూపించడంతో కొత్త శకానికి నాంది పలికినట్టు అయ్యింది
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీతరచయిత చంద్రబోస్ ఇకపై దగ్గరలో మళ్ళీ ఈ ఘనత ఇంకెవరూ సాధించలేరేమో అన్నంత ఒక అద్భుత ఘట్టంలో భాగమయ్యారు. టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎన్నో గొప్ప మైలురాళ్లు అందుకున్నప్పటికీ ఈ రోజు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మహామహా దిగ్గజాలు అందుకోలేని గౌరవం ఇవాళ ఈ ఇద్దరూ సొంతం చేసుకున్నారు. నెలల తరబడి ఆర్ఆర్ఆర్ ని గ్లోబల్ ఆడియన్స్ కి చేరువ చేసేందుకు రాజమౌళి కష్టానికి ఇది పూర్తి ప్రతిఫలం కాకపోయినా చిన్నది చేసేది మాత్రం ఖచ్చితంగా కాదు. ఒక తెలుగు పాట ఇంటర్నేషనల్ స్టేజి మీద ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నభూతో నభవిష్యతి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…