కాస్టింగ్ కౌచ్.. కొన్నేళ్ల నుంచి ఈ మాట తరచుగా వింటున్నాం. ఒకప్పుడు తమపై జరిగే లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యే మహిళలు చాలా తక్కువగా కనిపించేవారు. ఇండస్ట్రీలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా నోరు విప్పేవాళ్లు కాదు. కానీ ‘మీ టూ’ ఉద్యమం తర్వాత ఎంతోమంది మౌనం వీడారు. సినీ పరిశ్రమలోనే కాక వివిధ రంగాల్లో తమపై జరిగిన అఘాయిత్యాలు.. ఎదురైన లైంగిక వేధింపుల గురించి మహిళలు గళం విప్పారు. క్రమంగా ఈ మూమెంట్ కొంచెం మరుగున పడ్డప్పటికీ.. ఇప్పటికీ తరచుగా ఎవరో ఒక ఫిలిం సెలబ్రెటీ తమ జీవితంలో ఎదురైన ‘కాస్టింగ్ కౌచ్’ అనుభవాల గురించి చెబుతూనే ఉంటారు.
తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ వచ్చింది. బాలీవుడ్ చరిత్రలోనే మేటి నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న విద్య.. కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడి నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
“నిజానికి నేను కాస్టింగ్ కౌచ్ బారిన పడలేదు. కానీ నన్ను అందులోకి లాగే ప్రయత్నాలు జరగకుండా ఏమీ లేదు. కెరీర్ ఆరంభంలో ఒక చేదు అనుభవాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఒక యాడ్ షూట్ కోసం చెన్నైకి వెళ్లినపుడు ఓ దర్శకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాలని చూశాడు. ఆ దర్శకుడు ఓ సినిమా గురించి మాట్లాడేందుకు ముందు కాఫీ షాప్కు పిలిచాడు. కథ గురించి మాట్లాడుతుండగానే.. మిగతా విషయాలు రూంకి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు. ఒక్కదాన్నే ఉండటం వల్ల కొంచెం భయపడుతూ వెళ్లాను. అక్కడికి వెళ్లాక తన ఉద్దేశం అర్థమై నేను తెలివిగా గది తలుపులు తెరిచి ఉంచి పెట్టాను. అతడికి ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నాకు ఎవరూ ఏ సలహా ఇవ్వకపోయినా.. నాకు నేను తెలివిగా వ్యవహరించి నన్ను కాపాడుకున్నా” అని విద్య వెల్లడించింది.
This post was last modified on March 11, 2023 6:34 pm
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను తెచ్చుకున్న క్రేజ్ అంతా…
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…