నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విమర్శలు ఓ రేంజ్ లో వచ్చి పడుతున్నాయి. రానా ముందే దీన్ని ఫ్యామిలీస్ తో చూడొద్దని హింట్ ఇచ్చినప్పటికీ క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ అభిమానులున్న వెంకటేష్ బ్రాండ్ వల్ల ఆ హెచ్చరికను పట్టించుకోకుండా షోలు వేసిన వాళ్లే ఎక్కువ. తీరా చూస్తే విచ్చలవిడి బూతుతో పాటు అసభ్యకర దృశ్యాలు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఇది వేరొకరు చేసుంటే ఇంత చర్చ ఉండేది కాదు. కానీ ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ స్టార్ డం ఉన్న సీనియర్ అగ్రనటుడు చేయడం వల్ల సమస్య వచ్చింది.
వీక్ గా ఉన్న ఇండియన్ మార్కెట్ ని బలోపేతం చేసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ మాములు స్కెచ్చులు వేయడం లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే 2024లో రిలీజ్ కాబోతున్న దక్షిణాది క్రేజీ సినిమాలు చాలా కొనేసింది. మన జనానికి వెబ్ సిరీస్ లు అలవాటు చేయడం కోసం ఏకంగా వెంకటేష్ ని లైన్ లో పెట్టేసి తమ బ్రాండ్ మధ్యతరగతికి కూడా చేరేలా ప్లాన్ చేసుకుంది. రెమ్యునరేషన్ వల్ల వెంకీ ఒప్పుకున్నారా లేక దేశం మొత్తం ఈ ట్రెండ్ నడుస్తోందని చెప్పి ఒప్పించారా తెలియదు కానీ మొత్తానికి మొదటిసారి వెంకటేష్ అనవసరంగా టార్గెట్ అయ్యారు.
కొందరు ఫ్యాన్స్ ఇంతకన్నా దారుణమైన కంటెంట్ అన్ని ఓటిటిలో ఉన్నప్పుడు తమ హీరోనే ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారనే లాజిక్ తీస్తున్నారు. ఇదీ కరెక్ట్ కాదు. ఎవరో కర్ర హీరో చేస్తే జనం పట్టించుకోరు. చూడటం మానేస్తారు. కానీ ఒక బ్రాండ్ గా కోట్లాది ఫాలోయింగ్ ఉన్నప్పుడు దానికి జవాబుదారీతనాన్ని ఆశించడం తప్పేమీ కాదు. గతంలో చిరంజీవి అల్లుడా మజాకా చేసినందుకు మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. అది సినిమా కాబట్టి నిరసన స్వరం గట్టిగా వినిపించింది. కానీ రానా నాయుడు వెబ్ సిరీస్ కావడంతో అంత రచ్చ జరగకపోవచ్చు కానీ ఒకరకంగా చూస్తే నెట్ ఫ్లిక్స్ పక్కా ప్లాన్ తోనే ఇదంతా సెట్ చేసినట్టు కనిపిస్తోంది. లాభం తనకైనా నష్టం వెంకీకే.
This post was last modified on March 11, 2023 1:54 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…