హీరోయిన్లు తమ అందాలను మెరుగు పరుచుకునే క్రమంలో సర్జరీలు చేయించుకోవడం మామూలే. కొందరు గుట్టు చప్పుడు కాకుండా ఈ పని పూర్తి చేస్తుంటారు. సర్జరీల తర్వాత ఆ విషయం బయటికి కూడా చెప్పుకోరు. కానీ కొందరు మాత్రం ఈ విషయంలో ఓపెన్ అయిపోతుంటారు. శ్రీదేవి దగ్గర్నుంచి శ్రుతి హాసన్ వరకు ఇలా సర్జరీల బాట పట్టి ముక్కుతో పాటు రకరకాల పార్ట్లను సరి చేసుకున్న వాళ్లే. బ్రెస్ట్ సర్జరీలతో ఎద అందాలను పెంచుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇలా సర్జరీలు చేయించుకున్న వాళ్లపై కౌంటర్లు వేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు.
కాగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన ప్రియాంక చోప్రా కూడా కెరీర్ ఆరంభంలో తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్న విషయాన్ని తాజాగా తన ఆత్మకథలో వెల్లడించింది. ఆ సర్జరీ తర్వాత తాను ఎలా బెంబేలెత్తిపోయింది ఆమె వివరించింది.
“నేను నా ముక్కును సరి చేసుకునేందుకు ఒక సర్జరీ చేయించుకున్నా. కానీ ఆ సర్జరీ తర్వాత నా ఆకారం పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది. ముక్కుకు ఉన్న బ్యాండేజీ తీసి చూుకున్నాక నేను, మా అమ్మ భయపడిపోయాం. నా ముఖం మరోలా కనిపించింది. అద్దంలో వేరే వ్యక్తిని చూస్తున్న భావన కలిగింది. జనాలు ఏమంటారో అని చాలా భయపడిపోయాను. నిరాశ చెందాను. నేను మామూలు మనిషి కావడానికి చాలా సమయం పట్టింది” అని ప్రియాంక వెల్లడించింది.
ఒకప్పటి మిస్ వరల్డ్ అయిన ప్రియాంక.. బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలు చేయడమే కాక హాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లోనూ నటించింది. హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ను పెళ్లాడి ఒక బిడ్డకు తల్లి కూడా అయిన ప్రియాంక.. త్వరలోనే ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 10, 2023 2:42 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…