Movie News

‘సైంధవ్’ కోసం ఇద్దరు హీరోయిన్స్ ? 

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ తో గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమా ఏ స్టాండర్డ్స్ లో ఉండబోతుందో రుచి రుచూపించాడు శైలేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా ఈ  నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదటి షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారు. అక్కడే కొంత భాగం ఘాట్ చేయబోతున్నారు. ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ మరి కొంత పార్ట్ ఘాట్ చేసుకొస్తారు. 

సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఎనౌన్స్ మెంట్ కంటే ముందే మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసుకున్నారు. తాజాగా రుహానీ శర్మను మరో హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. రుహానీ ఇందులో గెస్ట్ రోల్ కి కాస్త ఎక్కువగా ఉండే పాత్ర చేయనుందని తెలుస్తుంది. ఇద్దరిలో ఓ పాత్ర చనిపోతుందని ఇన్సైడ్ న్యూస్. 

త్వరలోనే మేకర్స్ ఈ  హీరోయిన్స్ కి వెల్కం ఆన్ బోర్డ్ చెప్పి పేర్లు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరు మొదటి షెడ్యూల్ లో పాల్గొంటారు. ‘హిట్’ ఫ్రాంచైజ్ తర్వాత శైలేష్ కొలను తీస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఎనౌన్స్ మెంట్ గ్లిమ్స్ తో రిలీజ్ చేసిన కంటెంట్ టీజర్ అందరినీ ఆకర్షించింది.

This post was last modified on March 10, 2023 8:09 am

Share

Recent Posts

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

26 seconds ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

14 minutes ago

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…

24 minutes ago

ఏష నాగుల కట్ట… కలెక్షన్లు తెచ్చే మూట

ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…

2 hours ago

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌,…

3 hours ago

ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ అవ‌స‌రం… ఇదిగో రీజ‌న్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు ఎంత అవ‌స‌ర‌మో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయ‌న‌ను…

3 hours ago