వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ తో గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమా ఏ స్టాండర్డ్స్ లో ఉండబోతుందో రుచి రుచూపించాడు శైలేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదటి షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారు. అక్కడే కొంత భాగం ఘాట్ చేయబోతున్నారు. ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ మరి కొంత పార్ట్ ఘాట్ చేసుకొస్తారు.
సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఎనౌన్స్ మెంట్ కంటే ముందే మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసుకున్నారు. తాజాగా రుహానీ శర్మను మరో హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. రుహానీ ఇందులో గెస్ట్ రోల్ కి కాస్త ఎక్కువగా ఉండే పాత్ర చేయనుందని తెలుస్తుంది. ఇద్దరిలో ఓ పాత్ర చనిపోతుందని ఇన్సైడ్ న్యూస్.
త్వరలోనే మేకర్స్ ఈ హీరోయిన్స్ కి వెల్కం ఆన్ బోర్డ్ చెప్పి పేర్లు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరు మొదటి షెడ్యూల్ లో పాల్గొంటారు. ‘హిట్’ ఫ్రాంచైజ్ తర్వాత శైలేష్ కొలను తీస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఎనౌన్స్ మెంట్ గ్లిమ్స్ తో రిలీజ్ చేసిన కంటెంట్ టీజర్ అందరినీ ఆకర్షించింది.
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…