వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ తో గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమా ఏ స్టాండర్డ్స్ లో ఉండబోతుందో రుచి రుచూపించాడు శైలేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదటి షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారు. అక్కడే కొంత భాగం ఘాట్ చేయబోతున్నారు. ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ మరి కొంత పార్ట్ ఘాట్ చేసుకొస్తారు.
సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఎనౌన్స్ మెంట్ కంటే ముందే మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసుకున్నారు. తాజాగా రుహానీ శర్మను మరో హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. రుహానీ ఇందులో గెస్ట్ రోల్ కి కాస్త ఎక్కువగా ఉండే పాత్ర చేయనుందని తెలుస్తుంది. ఇద్దరిలో ఓ పాత్ర చనిపోతుందని ఇన్సైడ్ న్యూస్.
త్వరలోనే మేకర్స్ ఈ హీరోయిన్స్ కి వెల్కం ఆన్ బోర్డ్ చెప్పి పేర్లు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరు మొదటి షెడ్యూల్ లో పాల్గొంటారు. ‘హిట్’ ఫ్రాంచైజ్ తర్వాత శైలేష్ కొలను తీస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఎనౌన్స్ మెంట్ గ్లిమ్స్ తో రిలీజ్ చేసిన కంటెంట్ టీజర్ అందరినీ ఆకర్షించింది.
This post was last modified on March 10, 2023 8:09 am
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…