వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ తో గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమా ఏ స్టాండర్డ్స్ లో ఉండబోతుందో రుచి రుచూపించాడు శైలేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదటి షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారు. అక్కడే కొంత భాగం ఘాట్ చేయబోతున్నారు. ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ మరి కొంత పార్ట్ ఘాట్ చేసుకొస్తారు.
సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఎనౌన్స్ మెంట్ కంటే ముందే మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసుకున్నారు. తాజాగా రుహానీ శర్మను మరో హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. రుహానీ ఇందులో గెస్ట్ రోల్ కి కాస్త ఎక్కువగా ఉండే పాత్ర చేయనుందని తెలుస్తుంది. ఇద్దరిలో ఓ పాత్ర చనిపోతుందని ఇన్సైడ్ న్యూస్.
త్వరలోనే మేకర్స్ ఈ హీరోయిన్స్ కి వెల్కం ఆన్ బోర్డ్ చెప్పి పేర్లు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరు మొదటి షెడ్యూల్ లో పాల్గొంటారు. ‘హిట్’ ఫ్రాంచైజ్ తర్వాత శైలేష్ కొలను తీస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఎనౌన్స్ మెంట్ గ్లిమ్స్ తో రిలీజ్ చేసిన కంటెంట్ టీజర్ అందరినీ ఆకర్షించింది.
This post was last modified on March 10, 2023 8:09 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…