బోయపాటి శ్రీను మాస్ సినిమాలు తీయడంలో మేటి అనిపించుకున్న దర్శకుడు. బాలకృష్ణ లాంటి మాస్ హీరోని ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినట్టు తన సమకాలీన దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదు.
అయితే మాస్ సినిమాలు తీయడంలో ఒక తిరకాసు ఉంది. ఏమాత్రం గీత దాటినా కానీ అతి అనిపించి అభాసుపాలవుతాయి. అందుకే బాలయ్య సినిమాలలో అన్ని ట్రోలింగ్ కి గురయ్యాయి. పవన్ కళ్యాణ్ మాస్ సినిమా కొమరం పులి కూడా అలానే కామెడీ అయిపోయింది.
బోయపాటి శ్రీను కూడా బ్యాలన్స్ తప్పి వినయ విధేయ రామ తీసాడు. అందులోని కొన్ని సన్నివేశాలను ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటారు. అలాంటి సినిమాలు మళ్ళీ చేయనని, ఫాన్స్ క్షమించాలని చరణ్ బహిరంగంగా లేఖ రాసాడు.
అయితే బోయపాటి మాత్రం ఆ సినిమాలో లోపం ఉందంటే ఒప్పుకునేవాడు కాదట. ఆ సినిమాకు టీవిలో వేసినప్పుడల్లా సూపర్ టీఆర్ఫీలు వస్తున్నాయి. ఇంత రిపీట్ వేల్యూ చాలా తక్కువ సినిమాలకు ఉందని అంటోంది స్టార్ మా నెట్వర్క్. తన సినిమా గొప్పతనం ఇప్పటికి తెలిసింది అనుకుని బాలకృష్ణ సినిమాలో వివివిలోని సిల్లీ సీన్లు మరిన్ని పెట్టేయడు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on July 28, 2020 11:03 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…