బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి పెద్ద పెద్ద హీరోలు వెబ్ సిరీస్లు చేశారు కానీ.. సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు పెద్దగా అటు వైపు చూడట్లేదు. తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా ఇప్పటిదాకా డిజిటల్ ఎంట్రీ ఇవ్వలేదు. తొలిసారి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి ఒకేసారి డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. వీళ్లిద్దరి కలయికలో స్ట్రీమింగ్ జెయింట్ నెట్ఫ్లిక్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ డిజిటల్ రిలీజ్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచే ‘రానా నాయుడు’ స్ట్రీమ్ కాబోతోంది. సరిగ్గా ఈ సిరీస్ రిలీజయ్యే టైంకి టాలీవుడ్లో చెప్పుకోదగ్గ కొత్త థియేట్రికల్ రిలీజ్లు ఏమీ లేవు.
ముందు ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమాను 10వ తేదీకి షెడ్యూల్ చేశారు కానీ.. అది వాయిదా పడిపోయింది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘సీఎస్ఐ సనాతన్’ లాంటి చిన్న సినిమాలేవో కొన్ని రిలీజవుతున్నాయి. ఈ సినిమాలు వేటికీ బజ్ లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు కావివి. గత వారం విడుదలైన ‘బలగం’ ఓ మోస్తరుగా ఆడుతోంది తప్ప.. థియేటర్లు కొన్ని వారాల నుంచి డల్లుగా నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ‘రానా నాయుడు’ రిలీజవుతుండడంతో ఫోకస్ అంతా దాని మీదే నిలవబోతోంది.
‘రానా నాయుడు’ మీద ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనే కాక ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ బాగానే ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం వెంకీ షాకింగ్ లుక్లోకి మారారు. ఫ్యామిలీ హీరోగా పేరుపడ్డ ఆయన.. ఈ సిరీస్లో కొన్ని బూతులు పలకడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక క్రిమినల్ అయిన తండ్రి.. పోలీసాఫీసర్ అయిన కొడుకు మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. మరి వెంకీ-రానాల డిజిటల్ ఎంట్రీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on March 7, 2023 1:48 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…