గత ఇరవై నాలుగు గంటలకు పైగా సోషల్ మీడియాని ఊపేసిన కెజిఎఫ్ కామెంట్ల వ్యవహారం ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. తాను వాడిన భాష పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరుతున్నానని అయితే అభిప్రాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నిన్న రాత్రి వెంకటేష్ మహా విడుదల చేసిన వీడియోకు మిశ్రమ స్పందన దక్కింది. చెప్పే సారీ ఏదో క్లియర్ గా చెప్తే పోయేదానికి మళ్ళీ మెలిక ఎందుకని నెటిజెన్లు కొందరు నిలదీశారు. ఈ ఇష్యూతో ఇతనితో పాటు పాల్గొన్న వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహనకృష్ణలు కూడా టార్గెట్ కావడం చాలా దూరం వెళ్ళింది.
మొత్తానికి పెద్ద బురద తొక్కినా కళ్ళు కడుక్కునే ప్రయత్నం అందరూ చేయడం విశేషం. కమర్షియల్ సినిమాని తామేమీ తీసిపారేయడం లేదని ఒకవేళ ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించమని ముందుగా నందిని రెడ్డి చెప్పేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె డైరెక్ట్ చేసిన అన్నీ మంచి శుభశకునములే త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి అవసరం లేని వివాదాలు ఎంత మాత్రం మంచిది కాదు. వివేక్ ఆత్రేయ సైతం ఇన్స్ టా వేదికగా చిన్నపాటి సుదీర్ఘ వివరణ ఇచ్చి అక్కడి సందర్భంలో అనుకోకుండా నవ్వుతూ స్పందించాను తప్ప ఎవరినీ అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు.
మిగిలిన వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మొత్తానికీ వ్యవహారానికి శుభం కార్డు పడింది. వెంకటేష్ మహా తన మిత్రులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ మరో టెక్స్ట్ ట్వీట్ చేశారు. ఈ మొత్తం రభస మిగిలిన అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఒక డేంజర్ బెల్ అనే చెప్పాలి. ఇంటర్వ్యూలు ఇస్తున్నాం కదా మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఎలా బడితే అలా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను సైతం వెక్కిరించొచ్చని తొందరపడితే పరిణామాలు ఎలా ఉంటాయో స్పష్టంగా అర్థమైపోయింది. నోరు మంచిదైతే మనముండే ఊరు చుట్టూ ఉండే మనుషులు అందరూ మంచివాళ్లే అవుతారు.
This post was last modified on March 7, 2023 1:43 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…