గత ఇరవై నాలుగు గంటలకు పైగా సోషల్ మీడియాని ఊపేసిన కెజిఎఫ్ కామెంట్ల వ్యవహారం ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. తాను వాడిన భాష పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరుతున్నానని అయితే అభిప్రాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నిన్న రాత్రి వెంకటేష్ మహా విడుదల చేసిన వీడియోకు మిశ్రమ స్పందన దక్కింది. చెప్పే సారీ ఏదో క్లియర్ గా చెప్తే పోయేదానికి మళ్ళీ మెలిక ఎందుకని నెటిజెన్లు కొందరు నిలదీశారు. ఈ ఇష్యూతో ఇతనితో పాటు పాల్గొన్న వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహనకృష్ణలు కూడా టార్గెట్ కావడం చాలా దూరం వెళ్ళింది.
మొత్తానికి పెద్ద బురద తొక్కినా కళ్ళు కడుక్కునే ప్రయత్నం అందరూ చేయడం విశేషం. కమర్షియల్ సినిమాని తామేమీ తీసిపారేయడం లేదని ఒకవేళ ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించమని ముందుగా నందిని రెడ్డి చెప్పేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె డైరెక్ట్ చేసిన అన్నీ మంచి శుభశకునములే త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి అవసరం లేని వివాదాలు ఎంత మాత్రం మంచిది కాదు. వివేక్ ఆత్రేయ సైతం ఇన్స్ టా వేదికగా చిన్నపాటి సుదీర్ఘ వివరణ ఇచ్చి అక్కడి సందర్భంలో అనుకోకుండా నవ్వుతూ స్పందించాను తప్ప ఎవరినీ అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు.
మిగిలిన వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మొత్తానికీ వ్యవహారానికి శుభం కార్డు పడింది. వెంకటేష్ మహా తన మిత్రులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ మరో టెక్స్ట్ ట్వీట్ చేశారు. ఈ మొత్తం రభస మిగిలిన అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఒక డేంజర్ బెల్ అనే చెప్పాలి. ఇంటర్వ్యూలు ఇస్తున్నాం కదా మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఎలా బడితే అలా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను సైతం వెక్కిరించొచ్చని తొందరపడితే పరిణామాలు ఎలా ఉంటాయో స్పష్టంగా అర్థమైపోయింది. నోరు మంచిదైతే మనముండే ఊరు చుట్టూ ఉండే మనుషులు అందరూ మంచివాళ్లే అవుతారు.
This post was last modified on March 7, 2023 1:43 pm
ఒక పెద్ద సీజన్ అయిపోతే దాని ప్రభావం బాక్సాఫీస్ మీద కొన్ని రోజులు లేదా ఒక్కోసారి కొన్ని వారాల పాటు…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు…
వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు…
పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. రాజ్యసభకు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024…