బాలు, కంత్రి, శక్తి, కథానాయకుడు లాంటి వరుస డిజాస్టర్లతో ఒక దశలో టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితికి వచ్చింది వైజయంతీ మూవీస్ సంస్థ. అశ్వినీదత్ వల్ల కానిది తాము చేద్దామనుకుని ఆయన కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్లు కొత్తగా స్వప్న సినిమా బేనర్ పెట్టి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీస్తే అవీ వర్కవుట్ కాలేదు. అలాంటి దశలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న సినిమాతో మళ్లీ దత్ ఫ్యామిలీ నిలబడింది. అక్కడి నుంచి వరుస హిట్లు డెలివర్ చేస్తోంది. ముఖ్యంగా ‘మహానటి’ సినిమాతో దత్ పూర్వ వైభవాన్ని అందుకున్నారనే చెప్పాలి. ఇప్పుడాయన ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మెగా ప్రాజెక్టు చేయబోతున్నాడు.
దీంతో పాటే స్వప్న సినిమా బేనర్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల నిర్మాణమూ కొనసాగనుంది. ఈ బేనర్లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల వార్తలొచ్చాయి. ‘అందాల రాక్షసి’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో సత్తా చాటి.. ఆపై లై, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో దారుణమైన ఫలితాలందుకున్న హను రాఘవపైడికి దత్ కూతుళ్లు ఛాన్సివ్వబోతున్నట్లు వార్తలొచ్చాయి. దుల్కర్ సల్మాన్ ఇందులో హీరో అన్నారు. అలాగే ‘ఓ బేబీ’తో ఫాంలోకి వచ్చిన నందిని రెడ్డి సైతం ఈ బేనర్ కోసం ఓ కథ రెడీ చేస్తోంది కొంత కాలంగా. ఈ రెండింట్లో ఏదో ఒకటి మంగళవారం అనౌన్స్ కాబోతోంది. తమ బేనర్లో తెరకెక్కబోయే కొత్త సినిమా గురించి ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ రాబోతోందని స్వప్న సినిమా బేనర్ ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. మరి ఆ ప్రకటన హను-దుల్కర్ సినిమా గురించా.. లేక నందిని రెడ్డి మూవీ గురించా అన్నది చూడాలి.
This post was last modified on July 28, 2020 2:59 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…