Movie News

ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ అట.. అదా ఇదా?

బాలు, కంత్రి, శక్తి, కథానాయకుడు లాంటి వరుస డిజాస్టర్లతో ఒక దశలో టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితికి వచ్చింది వైజయంతీ మూవీస్ సంస్థ. అశ్వినీదత్ వల్ల కానిది తాము చేద్దామనుకుని ఆయన కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్‌లు కొత్తగా స్వప్న సినిమా బేనర్ పెట్టి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీస్తే అవీ వర్కవుట్ కాలేదు. అలాంటి దశలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న సినిమాతో మళ్లీ దత్ ఫ్యామిలీ నిలబడింది. అక్కడి నుంచి వరుస హిట్లు డెలివర్ చేస్తోంది. ముఖ్యంగా ‘మహానటి’ సినిమాతో దత్ పూర్వ వైభవాన్ని అందుకున్నారనే చెప్పాలి. ఇప్పుడాయన ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మెగా ప్రాజెక్టు చేయబోతున్నాడు.

దీంతో పాటే స్వప్న సినిమా బేనర్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల నిర్మాణమూ కొనసాగనుంది. ఈ బేనర్లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల వార్తలొచ్చాయి. ‘అందాల రాక్షసి’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో సత్తా చాటి.. ఆపై లై, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో దారుణమైన ఫలితాలందుకున్న హను రాఘవపైడికి దత్ కూతుళ్లు ఛాన్సివ్వబోతున్నట్లు వార్తలొచ్చాయి. దుల్కర్ సల్మాన్ ఇందులో హీరో అన్నారు. అలాగే ‘ఓ బేబీ’తో ఫాంలోకి వచ్చిన నందిని రెడ్డి సైతం ఈ బేనర్ కోసం ఓ కథ రెడీ చేస్తోంది కొంత కాలంగా. ఈ రెండింట్లో ఏదో ఒకటి మంగళవారం అనౌన్స్ కాబోతోంది. తమ బేనర్లో తెరకెక్కబోయే కొత్త సినిమా గురించి ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని స్వప్న సినిమా బేనర్ ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. మరి ఆ ప్రకటన హను-దుల్కర్ సినిమా గురించా.. లేక నందిని రెడ్డి మూవీ గురించా అన్నది చూడాలి.

This post was last modified on July 28, 2020 2:59 am

Share
Show comments
Published by
suman

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

34 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago