టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెకు బ్రేక్ పడింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొంటుండగా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గాయపడటంతో తాత్కాలికంగా చిత్రీకరణ వాయిదా వేసినట్టు సమాచారం. ఎముకలకు కలిగిన గాయంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో ప్రాధమికంగా చికిత్స తీసుకుని తిరిగి ముంబై వెళ్ళిపోయి తన స్వగృహం జల్సాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదంతా అమితాబ్ స్వయంగా తన బ్లాగులో ఇచ్చిన వివరణ. కొన్ని వారాల పాటు డాక్టర్లు విశ్రాంతిని సూచించారట.
దీంతో ప్రాజెక్ట్ కె ఎంత కాలం ఆగుతుందో వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిర్మాత అశ్వినీదత్ అసలు అమితాబ్ తమ సినిమా వల్ల ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదని మూడు రోజుల క్రితమే ఇక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని ముంబై వెళ్లిపోయారని చెప్పినట్టుగా వచ్చిన వార్త కొంత అయోమయానికి దారి తీస్తోంది. ఒకపక్కా ఆర్టిస్టు స్వయంగా విషయాన్ని వివరిస్తే ప్రొడ్యూసర్ నుంచి ఇంకో వెర్షన్ వినిపించడం అనూహ్యం. ప్రాజెక్ట్ కె వచ్చే ఏడాది జనవరి 12 విడుదలని అఫీషియల్ గా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.
అమితాబ్ రెస్ట్ కు కారణం ఏదైనా ఇప్పటికిప్పుడు ఆయన క్యారెక్టర్ ఉన్న సన్నివేశాలు మాత్రం చిత్రీకరించలేరు. బిగ్ బి భాగం ఎంత బాలన్స్ ఉందనే దాని మీద ప్లానింగ్ ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి వైజయంతి మూవీస్ నుంచి ఏదైనా నోట్ వస్తే ఈ కన్ఫ్యూజన్ కు తెరపడుతుంది. మనంలో చిన్న సీన్, సైరా నరసింహారెడ్డిలో ముఖ్యమైన పాత్ర చేశాక అమితాబ్ బచ్చన్ చేస్తున్న స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ఇదే. ఆయనతో పాటు ఇందులో దీపికా పదుకునే, అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాలకు ఇలాంటి అవాంతరాలు అలవాటయ్యాయి.
This post was last modified on March 6, 2023 12:17 pm
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…