ఉప్పెన లాంటి బ్లాక్బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయింది కృతి శెట్టి. నిజానికి ఈ సినిమా కోసం ముందు ఎంచుకున్న హీరోయిన్ వేరు. ప్రారంభోత్సవంలో కూడా ఆ అమ్మాయే పాల్గొంది. కానీ తర్వాత అనూహ్యంగా కృతి లైన్లోకి వచ్చింది. సినిమా రిలీజ్ ఆలస్యం అయినా సరే.. రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కృతికి అదిరిపోయే అప్లాజ్ వచ్చింది.
సినిమా బ్లాక్బస్టర్ కావడం, తనకూ పేరు రావడంతో అవకాశాలు వరుస కట్టాయి. కానీ రెండో సినిమా శ్యామ్ సింగరాయ్ మాత్రమే బాగా ఆడింది. బంగార్రాజు అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన మూడు సినిమాలు డిజాస్టర్లయ్యాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఈ సినిమాలు ఆమె కెరీర్ను వెనక్కి లాగేశాయి.
తర్వాతి సినిమాలతో అయినా కెరీర్ పుంజుకుంటుందనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. తమిళంలో ఆమెకు వచ్చిన అవకాశాలు వచ్చినట్లే చేజారిపోతున్నాయి. ముందు బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి కృతిని కథానాయికగా ఎంచుకున్నారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత అరుణ్ విజయ్ హీరోగా ఓ సినిమాకు కృతిని తీసుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఆ సినిమా నుంచి కృతిని తప్పించి రోషిణి ప్రకాష్ అనే కన్నడ కథానాయికను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఆమె ఆశలన్నీ నాగచైతన్య సరసన నటిస్తున్న కస్టడీ మీదే ఉన్నాయి. అది కూడా తేడా కొడితే కెరీర్ ముందుకు సాగడం కష్టమే. మలయాళంలోనూ టొవినో విజయ్ హీరోగా చేస్తున్న ఓ సినిమాకు కృతి కథానాయికగా ఎంపికైంది. కానీ ఆమె కెరీర్ అంతా టాలీవుడ్లోనే కావడంతో ఇక్కడ సక్సెస్ కావడమే కీలకం.
This post was last modified on March 5, 2023 11:32 pm
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…