టాలీవుడ్లో హిట్ చాలా అవసరమైన స్థితిలో ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకడు. అతను నిఖార్సయిన హిట్ కొట్టి చాలా ఏళ్లయింది. ఎప్పుడో 2014లో రిలీజైన లౌక్యం అతడి చివరి సూపర్ హిట్. ఆ తర్వాత అతడి సినిమాలేవీ అంచనాలను అందుకోలేకపోయాయి. ఒక్క సీటీమార్ ఓ మోస్తరుగా ఆడింది తప్ప.. మిగతావన్నీ తుస్సుమనిపించాయి. గత ఏడాది మంచి అంచనాల మధ్య రిలీజైన పక్కా కమర్షియల్ పెద్ద డిజాస్టర్ కావడంతో గోపీ మార్కెట్ మీద గట్టి ప్రభావం పడింది.
కాకపోతే ఈసారి అతను తనకు లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన శ్రీవాస్తో జట్టు కడుతుండడంతో రామబాణం మీద మంచి అంచనాలే ఉన్నాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
ఈసారి వేసవికి పెద్ద స్టార్ల సినిమాలేవీ లేకపోవడం గోపీచంద్కు కలిసొచ్చింది. మే 5న క్రేజీ డేట్ను తన సినిమా కోసం బుక్ చేసుకున్నాడు. మిడ్ సమ్మర్ సీజన్ అంటే చాలా మంచి డేట్ అన్నట్లే. రామబాణం చిత్రానికి పెద్దగా పోటీ ఉండే అవకాశం కనిపించడం లేదు. ఈ వేసవిలో వారానికి ఒకటి చెప్పునే సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి ప్రస్తుతానికి. గత ఏడాది కార్తికేయ-2, ధమాకా లాంటి బ్లాక్బస్టర్లు కొట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన చిత్రమిది. ఆ సంస్థ ఉన్న ఊపులో సినిమాను కొంచెం గట్టిగానే ప్రమోట్ చేసేలా కనిపిస్తున్నారు.
గోపీ-శ్రీవాస్ శైలికి తగ్గట్లే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లున్నారు. పోస్టర్లు ఆ సంకేతాలే ఇస్తున్నాయి. గోపీ సరసన డింపుల్ హయతి నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు.
This post was last modified on March 5, 2023 9:42 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…