దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతతో దర్శకుడిగా మొదటి సినిమా ఓకే చేయించుకోడమంటే మాటలు కాదు. బడ్జెట్ ఎంత తక్కువైనా సబ్జెక్టు విషయంలో రాజీ పడని ఆయన ధోరణి అందరికీ తెలిసిందే. అలాంటిది బలగం లాంటి హెవీ ఎమోషన్స్ ఉన్న కథతో కమెడియన్ వేణు మెప్పించడం అంటే విశేషమే. ప్రస్తుతానికి ఈ సినిమాకు మంచి టాక్ నడుస్తోంది. వసూళ్లు భీభత్సంగా లేవు కానీ మెల్లగా ఊపందుకుంటయనే నమ్మకం టీమ్ మొత్తంలో కనిపిస్తోంది. సరే ఫైనల్ స్టేటస్ తేల్చడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ మొత్తానికి వేణు సక్సెస్ అయిన మాట వాస్తవం.
హాస్య నటులు డైరెక్టర్లుగా మారిన వైనం టాలీవుడ్ లో చాలా తక్కువ. అందులోనూ విజయం సాధించిన వాళ్ళు పెద్దగా లేరు. ఉదాహరణకు ఏవిఎస్ ని తీసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్ లో రామానాయుడు గారు సూపర్ హీరోస్(1997) రూపంలో అవకాశం ఇచ్చారు. కానీ అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది తర్వాత మంచి ఫామ్ లో కుర్ర హీరోతో అంకుల్(2000) అని తీస్తే అదీ తేడా కొట్టింది. దెబ్బకు సైలెంట్ అయ్యారు. ఎంఎస్ నారాయణ కొడుకుని హీరోగా సెటిల్ చేయొచ్చనే ఉద్దేశంతో కొడుకు(2004)నే టైటిల్ గా పెట్టి సీరియస్ డ్రామా తీశారు రెండో రోజే బాక్సులు వెనక్కు వచ్చాయి.
తర్వాత భజంత్రీలు(2007) అని మరో ప్రయత్నం చేశారు కానీ రివర్స్ అయ్యింది. ఈ రెండు సినిమాల వల్ల చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అంతకు ముందే ధర్మవరపు సుబ్రహ్మణ్యం రెండు తోకల పిట్ట(1997) పేరుతో సీనియర్ నరేష్ తో ఓ చిత్రం డైరెక్ట్ చేశారు. అది ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. రచయితగా నటుడిగా మంచి అనుభవమున్న కృష్ణ భగవాన్ ఏకంగా సిమ్రాన్ ని తీసుకొచ్చి జాన్ అప్పారావు 40 ప్లస్ (2008) అనే ప్రయోగం చేశారు. మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. కానీ వేణుకి వీళ్లకు ఎదురైన అనుభవం కలగలేదు. బలగంని అందరూ యునానిమస్ గా మెచ్చుకున్నారు. కమర్షియల్ గా లాభాలొస్తే చాలు.
This post was last modified on March 4, 2023 9:37 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…