ఏదో పొగడాలని కాదు కానీ మలయాళం ఫిలిం మేకర్స్ ఆలోచనా విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఊహాకతీతంగా అసలీ కథ సినిమాగా పనికొస్తుందాని అనుమానపడే వాటిని ఏకంగా సూపర్ హిట్ చేసి చూపిస్తారు. అలాని అన్నీ రీమేకులకు పనికొస్తాయని కాదు. ఆ మధ్య డిజాస్టర్ అయిన బుట్టబొమ్మ ఒరిజినల్ వెర్షన్ కప్పేలా కేరళలో ఘనవిజయం అందుకుంది. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఇక్కడ యావరేజ్ అయితే లూసిఫర్ పేరు మీద ఇండస్ట్రీ రికార్డులు ఉన్నాయి. సరే వీటి సంగతలా ఉంచితే ఇటీవలే ఇరట్టా అనే మూవీ వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోజు జార్జ్ హీరో.
దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. అది తెలుసుకోవాలంటే కథ మీద ఓ లుక్ వేయాలి. ఇందులో హీరో డబుల్ యాక్షన్. ఇద్దరూ పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే పని చేస్తుంటారు. తమ్ముడిది శాడిస్ట్ మనస్తత్వం. ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి పడదు. ఓ రోజు ఉదయం మినిస్టర్ ప్రోగ్రాం జరగబోయే టైంలో కానిస్టేబుల్ గా ఉన్న తమ్ముడు పిస్తోలుతో కాల్చి చంపుకుంటాడు. ముందు హత్య అనుకుంటారు. తీరా అన్నయ్య రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టాక విస్తుపోయే నిజాలు బయటపడతాయి. ట్విస్ట్ తెలిశాక ఫ్యూజులు పోవడం ఖాయం. అతనెందుకు సూసైడ్ చేసుకున్నాడనేది జీర్ణించుకోలేం.
ఇది తెలుగులో రీమేక్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మానవ సంబంధాల పట్ల సున్నితంగా ఆలోచించే తెలుగు జనాలు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయలేరు. తండ్రి కూతురు అన్న చెల్లి వరసల మీద మనం పొరపాటున కూడా నెగటివ్ ట్విస్టులు చూడలేం. దానికి తగ్గట్టే మన దర్శక రచయితలు ఈ ఎమోషన్ల మీద అనవసరమైన ప్రయోగాలు చేయరు. కానీ ఇరట్ట దీనికి పూర్తిగా రివర్స్ లో ఉంటుంది. సినిమా మరీ గొప్పగా లేదు. రెండు గంటల లోపే నిడివి ఉన్నా మధ్యలో చాలా బోర్ కొట్టిస్తుంది. చివరి ఘట్టం మాత్రం వామ్మో ఇదేం క్లైమాక్స్ బాబోయ్ అనిపించి వెంటాడుతుంది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…