పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. తన సాటి హీరోలంతా రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేసుకుని వేగంగా దూసుకెళ్తున్న టైంలో సుకుమార్ నే నమ్ముకుని బన్నీ ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టడం పట్ల అభిమానులు ఆందోళన చెందిన మాట వాస్తవం . అయితే ప్యాన్ ఇండియా లెవల్ లో వచ్చిన ఇమేజ్ ని కాపాడుకునేందుకు అల్లు అర్జున్ ఏ చిన్న రిస్క్ కి సిద్ధంగా లేడు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ ఫైనల్ గా అదిరిపోయే కాంబినేషన్ ని సెట్ చేసుకుని అఫీషియల్ గా ప్రకటించేశాడు.
అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో, దాని రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో జెండా ఎగరేసి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో బన్నీ చేతులు కలిపాడు. ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్ లాంటి బడా నిర్మాణ సంస్థ తోడవ్వడంతో బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ లకు వాళ్ళు పెట్టిన ఖర్చు మర్చిపోగలమా. సందీప్ ఇటీవలే రన్బీర్ కపూర్ తో యానిమల్ ని పూర్తి చేశాడు. అందులో రష్మిక మందన్న హీరోయిన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ లో రిలీజ్ అయ్యాక సందీప్ ఫ్రీ అవుతాడు.
నెక్స్ట్ ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మీద పని చేస్తాడు. దాని కోసం ఎంతలేదన్నా ఏడాది పైగానే అవసరముంటుంది. ప్రస్తుతం పుష్ప పూర్తయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే సమీకరణాలు ఎలాగైనా మారొచ్చు కాబట్టి తెలివిగా సీరియల్ నెంబర్లు ఇవ్వకుండా బన్నీ జాగ్రత్త పడ్డాడు. హీరోలను వైల్డ్ గా యారోగంట్ గా చూపించడంతో తన శైలిని చూపించిన సందీప్ వంగా ఒక్క దెబ్బతో విజయ్ దేవరకొండని స్టార్ చేసినప్పుడు ఏకంగా ఐకాన్ స్టారే దొరికితే సందీప్ అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా.
This post was last modified on March 3, 2023 12:09 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…