గత పదేళ్లలో దక్షిణాది సినిమాల్లో బాగా హైలైట్ అయి మేటి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆర్టిస్టుల్లో ఫాహద్ ఫాజిల్ ఒకడు. మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్ను మలయాళంలో కూడా ప్రేక్షకులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని పాత్రల్లో అద్భుతమైన నటనతో కట్టిపడేసిన అతను.. ఆ తర్వాత ఎన్నో విలక్షణమైన పాత్రలు తనను వెతుక్కుంటూ వచ్చేలా చేసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటుడిగా నిలవడమే కాక అనేక అనేక పురస్కారాలు అందుకున్నాడు.
ఇతర భాషల నుంచి మేటి దర్శకులు కూడా అతడి వైపు చూసేలా చేసుకున్న ఫాహద్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్ను కూడా మెప్పించి పుష్పలో షెకావత్ పాత్రకు తనను ఎంచుకునేలా చేశాడు. ఈ పాత్ర సినిమాలో కనిపించింది కాసేపే అయినా ఎంత ఇంపాక్ట్ వేసిందో తెలిసిందే.
చివరి 20 నిమిషాల్లో సినిమా ఇంకో లెవెల్కు వెళ్లేలా చేసింది షెకావత్ పాత్రే. కాసేపు కనిపిస్తేనే అంత ఇంపాక్ట్ వేసిన ఫాహద్.. పుష్ప-2లో పూర్తిగా కనిపిస్తే ఇంకెంత మెస్మరైజ్ చేస్తాడో అని ప్రేక్షకులు మంచి అంచనాలతో ఉన్నారు. ఐతే పుష్ప-2 షూటింగ్ కొన్ని నెలల ముందే మొదలు కాగా.. ఇప్పటిదాకా అతను షూట్కు హాజరు కాలేదు. అల్లు అర్జున్ సహా దాదాపుగా ప్రధాన తారాగణమంతా ఒకరి తర్వాత సెట్స్లోకి వచ్చేయగా.. చివరగా ఇప్పుడు ఫాహద్ రంగప్రవేశం చేశాడు. ఫస్ట్ పార్ట్లో మాదిరే గుండు మేకప్ వేయించుకుని తాజాగా అతను షూటింగ్కు హాజరైనట్లు సమాచారం.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండే ఎర్రమంజిల్లో ఫాహద్ మీద సీన్లు తీస్తున్నాడట సుకుమార్. కొన్ని రోజుల తర్వాత బన్నీ, ఫాహద్ కాంబినేషన్ సీన్లు చిత్రీకరిస్తారట. ఈ చిత్రంలో కొత్తగా జగపతిబాబు రూపంలో మరో విలన్ రాబోతుండడం విశేషం.
This post was last modified on March 3, 2023 8:28 am
ఢిల్లీలో ఏడుగురి ప్రాణాలు తీసిన సత్య నికేతన్ భవనం ఘటనలో ఒక విషయం ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు…
హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…
సినిమా చూడాలంటే బుక్మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…
ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది అంటే మరో మాట లేకుండా సుకుమార్ పేరు చెప్పేయొచ్చు. టాలీవుడ్లోనే…
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్…
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…