తమిళనాడులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ ని మించి అని గొప్పగా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ కేవలం ఆ రాష్ట్రపు ఆడియన్స్ కి మాత్రమే నచ్చిందని చెప్పడానికి మరో సాక్ష్యం దొరికేసింది. మణిరత్నం ఎంత గొప్ప దర్శకులైనా చోళుల కథను అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో తడబడ్డారని టీవీ ప్రేక్షకులు కూడా తీర్పు ఇచ్చారు. ఇటీవలే తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జరుపుకున్న ఈ విజువల్ గ్రాండియర్ కు వచ్చిన టిఆర్పి రేటింగ్ అక్షరాలా 2.73 మాత్రమే. అది కూడా అర్బన్ మాత్రమే లెక్కలో తీసుకుంటే. రూరల్ కలిపి యావరేజ్ తీస్తే జస్ట్ 2.17.
మాములుగా డిజాస్టర్లకు మాత్రమే ఈ నెంబర్లు నమోదవుతాయి. పొన్నియిన్ సెల్వన్ మరీ అంత దారుణమైన చిత్రమేమీ కాదు. ఇక్కడ థియేట్రికల్ రెవెన్యూ సుమారు పది కోట్ల దాకా వచ్చింది. లాభాలు రాలేదు కానీ బ్రేక్ ఈవెన్ కి అతి కష్టం మీద అందుకుంది. జనాలు అధిక శాతం చూడలేదు కాబట్టి బుల్లితెరపై ఆదరిస్తారని లెక్కలు వేసిన శాటిలైట్ ఛానల్ కు పెద్ద షాక్ తగిలింది. అంటే మన పబ్లిక్ కి ఈ బ్యాక్ డ్రాప్ మీద ఏ మాత్రం ఆసక్తి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయినా నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్ లో ఇచ్చేసి ఇప్పుడు తాపీగా టీవీలో వస్తే ఇంతకన్నా రెస్పాన్స్ కష్టమే.
ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం ఏప్రిల్ 28 విడుదల కానుంది. వాయిదా పడిందన్న పుకార్లు రెండు రోజులు షికారు చేశాయి కానీ ఇవాళ లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి డేట్ ని ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. సో అఖిల్ ఏజెంట్ కి సోలో రిలీజ్ దక్కి తమిళనాడు కేరళలో లాభం కలుగుతుందనుకుంటే అదేమి జరిగేలా లేదు. ఐశ్వర్య రాయ్, విక్రమ్ పాత్రలను హైలైట్ చేస్తూ పీఎస్ 2 లో చాలా కథను మణిరత్నం చెప్పబోతున్నారట. అయినా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ దాకా వెళ్తే పిఎస్ పక్క స్టేట్స్ నే గెలవలేకపోయింది.
This post was last modified on March 2, 2023 3:58 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…