తమిళనాడులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ ని మించి అని గొప్పగా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ కేవలం ఆ రాష్ట్రపు ఆడియన్స్ కి మాత్రమే నచ్చిందని చెప్పడానికి మరో సాక్ష్యం దొరికేసింది. మణిరత్నం ఎంత గొప్ప దర్శకులైనా చోళుల కథను అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో తడబడ్డారని టీవీ ప్రేక్షకులు కూడా తీర్పు ఇచ్చారు. ఇటీవలే తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జరుపుకున్న ఈ విజువల్ గ్రాండియర్ కు వచ్చిన టిఆర్పి రేటింగ్ అక్షరాలా 2.73 మాత్రమే. అది కూడా అర్బన్ మాత్రమే లెక్కలో తీసుకుంటే. రూరల్ కలిపి యావరేజ్ తీస్తే జస్ట్ 2.17.
మాములుగా డిజాస్టర్లకు మాత్రమే ఈ నెంబర్లు నమోదవుతాయి. పొన్నియిన్ సెల్వన్ మరీ అంత దారుణమైన చిత్రమేమీ కాదు. ఇక్కడ థియేట్రికల్ రెవెన్యూ సుమారు పది కోట్ల దాకా వచ్చింది. లాభాలు రాలేదు కానీ బ్రేక్ ఈవెన్ కి అతి కష్టం మీద అందుకుంది. జనాలు అధిక శాతం చూడలేదు కాబట్టి బుల్లితెరపై ఆదరిస్తారని లెక్కలు వేసిన శాటిలైట్ ఛానల్ కు పెద్ద షాక్ తగిలింది. అంటే మన పబ్లిక్ కి ఈ బ్యాక్ డ్రాప్ మీద ఏ మాత్రం ఆసక్తి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయినా నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్ లో ఇచ్చేసి ఇప్పుడు తాపీగా టీవీలో వస్తే ఇంతకన్నా రెస్పాన్స్ కష్టమే.
ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం ఏప్రిల్ 28 విడుదల కానుంది. వాయిదా పడిందన్న పుకార్లు రెండు రోజులు షికారు చేశాయి కానీ ఇవాళ లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి డేట్ ని ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. సో అఖిల్ ఏజెంట్ కి సోలో రిలీజ్ దక్కి తమిళనాడు కేరళలో లాభం కలుగుతుందనుకుంటే అదేమి జరిగేలా లేదు. ఐశ్వర్య రాయ్, విక్రమ్ పాత్రలను హైలైట్ చేస్తూ పీఎస్ 2 లో చాలా కథను మణిరత్నం చెప్పబోతున్నారట. అయినా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ దాకా వెళ్తే పిఎస్ పక్క స్టేట్స్ నే గెలవలేకపోయింది.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…