బలగం.. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సంస్థ నుంచి వస్తున్న కొత్త చిత్రం. జబర్దస్త్ కామెడీ షోతో పాటు కొన్ని సినిమాల్లోనూ కామెడీ పాత్రలతో పేరు తెచ్చుకున్న వేణు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు. ఈ టైటిల్, దీని ప్రోమోలు చూస్తే ఇది పక్కా ‘తెలంగాణ’ సినిమాలా కనిపిస్తోంది.
ఈ శుక్రవారమే ‘బలగం’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ను ఒక రాజకీయ కార్యక్రమం లాగా మారుస్తూ ఆయన ప్రసంగం సాగడం విశేషం. తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష, యాస వినియోగం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవం జరుగుతోంది. అందుకు ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలే ఉదాహరణ. తెలంగాణలో ఇంతమయంది అజ్ఞాత సూర్యులు వెలుగుతున్నారంటే అందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే కారణం. ఒకప్పుడు ఏ భాష, యాస మాట్లాడ్డానికి మొహమాట పడ్డారో.. ఇప్పుడు వాటినే ప్రముఖ నటులు సైతం అన్ని వేదిక మీదా మాట్లాడుతున్నారంటే అందుకు కారకులు ఒకే ఒక్క కేసీఆర్. గుండె లోతుల్లోంచి వచ్చిన ఏ భావోద్వేగానికైనా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. సంస్కృతిని, మానవ సంబంధాల్ని చక్కగా ఆవిష్కరించిన చిత్రంలా ‘బలగం’ కనిపిస్తోంది. ఇలాంటి సినిమా తీసిన వేణుకు అభినందనలు. సి.నారాయణరెడ్డి, మిద్దె రాములక్క లాంటి వాళ్లు సిరిసిల్ల గడ్డపై పుట్టారు. అక్కడే పుట్టిన వేణు ఇప్పుడు సిరిసిల్లకు సినిమాను తీసుకొచ్చాడు. భీమ్స్, మంగ్లీ, కాసర్ల శ్యామ్ లాంటి వాళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తెలంగాణ సినిమాకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలుసు. భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్తాం’’ అని కేటీఆర్ అన్నారు.
This post was last modified on March 1, 2023 5:48 pm
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. ఎల్-2: ఎంపురాన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమా కూడా…
విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ…
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తుందా? లేక.. మంత్రివర్గంలో కూర్పు వరకు పరిమితం అవుతుందా? అంటే..…
అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే... గోల్డ్ కార్డ్…
పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే..…