హెల్త్ వర్కర్ల కోసమే హోటల్ తెరిచాడు. వేలాది మందికి తిండి పెట్టాడు. పీపీఈ కిట్లు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా వలస కార్మికుల కష్టాలు చూసి కదిలిపోయి.. ముంబయి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇలా ఏ వందా రెండొందల మందికి కాదు.. ఏకంగా 20 వేల మందికి సాయం చేశాడు. ఇందుకోసం కోట్లు ఖర్చు చేశాడు. ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోనూ సూద్ సేవా నిరతి అక్కడికి ఆగిపోలేదు.
లాక్ డౌన్ వేళ అవస్థలు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిన వాళ్లందరికీ సాయపడుతున్నాడు. కష్టాల్లో ఉన్న వాళ్లు తమ సన్నిహితులకో.. ప్రభుత్వాలకో.. స్థానిక నాయకులకో కాకుండా.. సోనూకే తమ కష్టం చెప్పుకుంటున్నారు. చాలామంది సోషల్ మీడియా ద్వారా సమస్యల్ని సోనూ దృష్టికి తెస్తున్నారు. సోనూ ఇంకెంతమందికి సాయం చేస్తాం, ఇక చాల్లే అనుకోకుండా ఈ తోడ్పాటును కొనసాగిస్తూనే ఉన్నాడు.
దీంతో అందరికీ రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ సోనూ రేంజ్ ఏంటి.. అతడి దగ్గర ఎంత డబ్బుంది.. సోనూ సేవా భావంతోనే ఇదంతా చేస్తున్నాడా.. ఇంకేదైనా ఆశిస్తున్నాడా.. అతడికి వేరే వాళ్ల సపోర్ట్ ఏమైనా ఉంటోందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే సోనూ ఆర్థిక స్థితి విషయానికి వస్తే.. అతడి ఆస్తుల విలువ రూ.130 కోట్లు అని ఓ బాలీవుడ్ మీడియా సంస్థ వెల్లడించింది.
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సోనూ.. హిందీ, తెలుగు, తమిళం సహా బహు భాషల్లో నటించాడు. అన్ని చోట్లా మంచి పేరే సంపాదించాడు. ఇండియాలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అతనొకడు. ఈ క్రమంలో సోనూ బాగానే సంపాదించాడు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ముంబయిలో పెద్ద ఇల్లు కొన్నాడు. హోటళ్లు తెరిచాడు.
ఐతే వేల కోట్లు ఉన్న వాళ్లకు కూడా చారిటీ కోసం డబ్బులు పెట్టడానికి మనసుండదు. తమ సంపాదనంలో 1 శాతం లోపు కూడా ఖర్చు చేయరు. కానీ సోనూ అలా ఆలోచించకుండా.. ఒక పరిమితి పెట్టుకోకుండా సాయం చేస్తూనే ఉన్నాడు. తన ఆస్తి విలువలో అతను కనీసం 10 శాతం అయినా ఖర్చు చేసి ఉంటాడని అంటున్నారు. అలా చూసినా అది గొప్ప విషయమే. అతడి వెనుక ఏవైనా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో లేదో తెలియదు మరి.
కానీ అతను కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడన్నది స్పష్టం. తన అండతో ఇళ్లకు చేరిన వలస కార్మికుల ఆనందం, ఉద్వేగం చూశాక జీవిత పరమార్థం ఏంటో సోనూ తెలుసుకున్నట్లున్నాడు. అందుకే ఆపకుండా తన సేవాభావాన్ని కొనసాగిస్తున్నట్లున్నాడు.
This post was last modified on July 27, 2020 3:21 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…