భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేర్కొనదగ్గ సినిమా.. నాయకుడు. లెజెండరీ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రం 1987లో విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ 35 ఏళ్లు గడిచాక ఇప్పుడు చూసినా ఆ సినిమా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇప్పటి ప్రేక్షకులు కూడా ఆ చిత్రంతో కనెక్ట్ అవుతారు. అలాంటి క్లాసిక్ అందించిందిన హీరో, దర్శకుడు ఇన్నేళ్లలో మళ్లీ కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే గత ఏడాది వీరి కలయికలో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పొన్నియన్ సెల్వన్-1తో భారీ విజయాన్ని అందుకున్న ఉత్సాహంలో కమల్తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు మణి.
ఈ చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీదే నిర్మిస్తుండడం విశేషం. అనౌన్స్మెంట్ తర్వాత వార్తల్లో లేని ఈ చిత్రం.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ఒక వెరైటీ కథాంశంతో తెరకెక్కనుందట. చనిపోయిన ఒక మనిషి మళ్లీ బ్రతికి సమాజంలోకి వస్తే ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే పాయింటే ఇది.
మణిరత్నం నుంచి ఈ దశలో ఇలాంటి సినిమాను ఊహించలేం. ఇంకో రెండు నెలల్లోనే పొన్నియన్ సెల్వన్-2 విడుదల కాబోతోంది. కమల్ కొన్ని నెలల్లో ఇండియన్-2 పూర్తి చేయబోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని అంచనా. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించనుంది. ఇంతకముందు కమల్తో ఆమె మన్మథబాణం, చీకటి రాజ్యం సినిమాలు చేసింది.
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే.. కన్నడకే పరిమితమైన ఒక నటుడు, దర్శకుడు. తన మార్కెట్ పరిధి చాలా…