Movie News

క‌మ‌ల్-మ‌ణిర‌త్నం.. ఒక వెరైటీ సినిమా

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా పేర్కొన‌ద‌గ్గ సినిమా.. నాయ‌కుడు. లెజెండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందించిన ఈ చిత్రం 1987లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కానీ 35 ఏళ్లు గడిచాక ఇప్పుడు చూసినా ఆ సినిమా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇప్ప‌టి ప్రేక్షకులు కూడా ఆ చిత్రంతో క‌నెక్ట్ అవుతారు. అలాంటి క్లాసిక్ అందించిందిన హీరో, ద‌ర్శ‌కుడు ఇన్నేళ్ల‌లో మ‌ళ్లీ కలిసి ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఐతే గ‌త ఏడాది వీరి క‌ల‌యిక‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1తో భారీ విజ‌యాన్ని అందుకున్న ఉత్సాహంలో క‌మ‌ల్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు మ‌ణి.

ఈ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ మీదే నిర్మిస్తుండ‌డం విశేషం. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత వార్త‌ల్లో లేని ఈ చిత్రం.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ చిత్రం ఒక వెరైటీ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ట‌. చ‌నిపోయిన ఒక మ‌నిషి మ‌ళ్లీ బ్ర‌తికి స‌మాజంలోకి వ‌స్తే ఎదురయ్యే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. విన‌డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పాయింటే ఇది.

మ‌ణిర‌త్నం నుంచి ఈ ద‌శ‌లో ఇలాంటి సినిమాను ఊహించ‌లేం. ఇంకో రెండు నెల‌ల్లోనే పొన్నియ‌న్ సెల్వ‌న్-2 విడుద‌ల కాబోతోంది. క‌మ‌ల్ కొన్ని నెల‌ల్లో ఇండియ‌న్-2 పూర్తి చేయ‌బోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి కాంబినేష‌న్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంద‌ని అంచ‌నా. ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇంత‌క‌ముందు క‌మ‌ల్‌తో ఆమె మ‌న్మ‌థ‌బాణం, చీక‌టి రాజ్యం సినిమాలు చేసింది.

Satya

Recent Posts

అమ‌రావ‌తికి ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇక్క‌డ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అనేక…

13 minutes ago

‘సనాతనం’పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…

2 hours ago

1000 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

3 hours ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

4 hours ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

5 hours ago

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…

10 hours ago