భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేర్కొనదగ్గ సినిమా.. నాయకుడు. లెజెండరీ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రం 1987లో విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ 35 ఏళ్లు గడిచాక ఇప్పుడు చూసినా ఆ సినిమా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇప్పటి ప్రేక్షకులు కూడా ఆ చిత్రంతో కనెక్ట్ అవుతారు. అలాంటి క్లాసిక్ అందించిందిన హీరో, దర్శకుడు ఇన్నేళ్లలో మళ్లీ కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే గత ఏడాది వీరి కలయికలో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పొన్నియన్ సెల్వన్-1తో భారీ విజయాన్ని అందుకున్న ఉత్సాహంలో కమల్తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు మణి.
ఈ చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీదే నిర్మిస్తుండడం విశేషం. అనౌన్స్మెంట్ తర్వాత వార్తల్లో లేని ఈ చిత్రం.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ఒక వెరైటీ కథాంశంతో తెరకెక్కనుందట. చనిపోయిన ఒక మనిషి మళ్లీ బ్రతికి సమాజంలోకి వస్తే ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే పాయింటే ఇది.
మణిరత్నం నుంచి ఈ దశలో ఇలాంటి సినిమాను ఊహించలేం. ఇంకో రెండు నెలల్లోనే పొన్నియన్ సెల్వన్-2 విడుదల కాబోతోంది. కమల్ కొన్ని నెలల్లో ఇండియన్-2 పూర్తి చేయబోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని అంచనా. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించనుంది. ఇంతకముందు కమల్తో ఆమె మన్మథబాణం, చీకటి రాజ్యం సినిమాలు చేసింది.
This post was last modified on March 1, 2023 11:17 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…