Movie News

క‌మ‌ల్-మ‌ణిర‌త్నం.. ఒక వెరైటీ సినిమా

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా పేర్కొన‌ద‌గ్గ సినిమా.. నాయ‌కుడు. లెజెండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందించిన ఈ చిత్రం 1987లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కానీ 35 ఏళ్లు గడిచాక ఇప్పుడు చూసినా ఆ సినిమా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇప్ప‌టి ప్రేక్షకులు కూడా ఆ చిత్రంతో క‌నెక్ట్ అవుతారు. అలాంటి క్లాసిక్ అందించిందిన హీరో, ద‌ర్శ‌కుడు ఇన్నేళ్ల‌లో మ‌ళ్లీ కలిసి ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఐతే గ‌త ఏడాది వీరి క‌ల‌యిక‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1తో భారీ విజ‌యాన్ని అందుకున్న ఉత్సాహంలో క‌మ‌ల్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు మ‌ణి.

ఈ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ మీదే నిర్మిస్తుండ‌డం విశేషం. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత వార్త‌ల్లో లేని ఈ చిత్రం.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ చిత్రం ఒక వెరైటీ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ట‌. చ‌నిపోయిన ఒక మ‌నిషి మ‌ళ్లీ బ్ర‌తికి స‌మాజంలోకి వ‌స్తే ఎదురయ్యే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. విన‌డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పాయింటే ఇది.

మ‌ణిర‌త్నం నుంచి ఈ ద‌శ‌లో ఇలాంటి సినిమాను ఊహించ‌లేం. ఇంకో రెండు నెల‌ల్లోనే పొన్నియ‌న్ సెల్వ‌న్-2 విడుద‌ల కాబోతోంది. క‌మ‌ల్ కొన్ని నెల‌ల్లో ఇండియ‌న్-2 పూర్తి చేయ‌బోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి కాంబినేష‌న్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంద‌ని అంచ‌నా. ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇంత‌క‌ముందు క‌మ‌ల్‌తో ఆమె మ‌న్మ‌థ‌బాణం, చీక‌టి రాజ్యం సినిమాలు చేసింది.

This post was last modified on March 1, 2023 11:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago