Movie News

క‌మ‌ల్-మ‌ణిర‌త్నం.. ఒక వెరైటీ సినిమా

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా పేర్కొన‌ద‌గ్గ సినిమా.. నాయ‌కుడు. లెజెండ‌రీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం రూపొందించిన ఈ చిత్రం 1987లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కానీ 35 ఏళ్లు గడిచాక ఇప్పుడు చూసినా ఆ సినిమా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇప్ప‌టి ప్రేక్షకులు కూడా ఆ చిత్రంతో క‌నెక్ట్ అవుతారు. అలాంటి క్లాసిక్ అందించిందిన హీరో, ద‌ర్శ‌కుడు ఇన్నేళ్ల‌లో మ‌ళ్లీ కలిసి ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఐతే గ‌త ఏడాది వీరి క‌ల‌యిక‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1తో భారీ విజ‌యాన్ని అందుకున్న ఉత్సాహంలో క‌మ‌ల్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు మ‌ణి.

ఈ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ మీదే నిర్మిస్తుండ‌డం విశేషం. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత వార్త‌ల్లో లేని ఈ చిత్రం.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ చిత్రం ఒక వెరైటీ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ట‌. చ‌నిపోయిన ఒక మ‌నిషి మ‌ళ్లీ బ్ర‌తికి స‌మాజంలోకి వ‌స్తే ఎదురయ్యే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. విన‌డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పాయింటే ఇది.

మ‌ణిర‌త్నం నుంచి ఈ ద‌శ‌లో ఇలాంటి సినిమాను ఊహించ‌లేం. ఇంకో రెండు నెల‌ల్లోనే పొన్నియ‌న్ సెల్వ‌న్-2 విడుద‌ల కాబోతోంది. క‌మ‌ల్ కొన్ని నెల‌ల్లో ఇండియ‌న్-2 పూర్తి చేయ‌బోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి కాంబినేష‌న్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుంద‌ని అంచ‌నా. ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఇంత‌క‌ముందు క‌మ‌ల్‌తో ఆమె మ‌న్మ‌థ‌బాణం, చీక‌టి రాజ్యం సినిమాలు చేసింది.

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

42 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago