80వ దశకంలో కథానాయికగా కొన్నేళ్లు మంచి మంచి పాత్రలతో అలరించిన జీవిత.. హీరో రాజశేఖర్ను పెళ్లాడాక నటనకు దూరం అయిపోయారు. ఆ తర్వాత ఆమె భర్త కెరీర్ మీదే దృష్టిసారించారు. ఆయన హీరోగా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. ప్రొడ్యూస్ కూడా చేశారు. జీవిత నటిగా కనిపించి దశాబ్దాలు దాటిపోయింది. ఐతే ఆమె చాలా కాలం తర్వాత ముఖానికి రంగు వేసుకుంటున్నట్లు సమాచారం. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా కోసం అని వార్తలు వస్తుండడం విశేషం.
ప్రస్తుతం హీరోగా జైలర్ సినిమాలో నటిస్తున్న రజినీకాంత్.. తన చిన్న కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రాబోయే ఓ సినిమాలో స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టును కొన్ని నెలల కిందటే ప్రకటించారు.
లాల్ సలామ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోంది. రజినీ ఇందులో తక్కువ రన్ టైంలో ముగిసిపోయే ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నారు ఆయనకు సోదరిగా ఒక స్పెషల్ రోల్లో జీవిత కనిపించనుందట.
దశాబ్దాల నుంచి నటనకు దూరంగా ఉన్న జీవితనే ఈ పాత్రకు తీసుకోవాలని ఐశ్వర్యకు ఎందుకు అనిపించిందో ఏమో? రజినీ కూతురు తీస్తున్న సినిమా.. పైగా రజినీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో జీవిత ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. చెన్నైలో కొన్ని రోజుల పాటు ఆమె చిత్రీకరణలో పాల్గొనబోతోందట. చివరగా ఆమె దర్శకురాలిగారాజశేఖర్ హీరోగా మలయాళ సినిమా జోసెఫ్ను శేఖర్ పేరుతో రీమేక్ చేసింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో జీవిత, రాజశేఖర్ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.
This post was last modified on March 1, 2023 9:19 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…