ప్రాంతీయ భాషా చిత్రాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు ఒకేసారి రెండు గెలిచే స్థాయికి ఎదిగాడు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. ఇది భారతీయులు గర్వించదగ్గ విషయం.
ఐతే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో సంచలనం సృష్టించాక రెహమాన్ కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనుకుంటే అలా ఏమీ జరగలేదు. ఒకప్పటితో పోలిస్తే అతడికి అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్లో రెహమాన్ వెనుకబడిపోయాడు. ఇందుకు కారణాలేంటో ఎవరికీ అంతుబట్టలేదు.
ఐతే తాజాగా ‘దిల్ బేచారా’ మూవీతో మళ్లీ తనేంటో చాటి చెప్నాడు రెహమాన్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్లో తనకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ పని చేస్తోందంటూ సంచనల వ్యాఖ్యలు చేశాడు. ‘దిల్ బేచారా’ సినిమా కూడా తన చేతికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగినట్లు వెల్లడించాడు.
సౌమ్యుడు, వివాద రహితుడు అయిన రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపిింది. రెహమాన్ వ్యాఖ్యలపై లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్కు ఆస్కార్ అవార్డులు రావడమే శాపమైందన్నాడు. ఇతను మన స్థాయి దాటిపోయాడు.. మనం హ్యాండిల్ చేయలేం అనే భావన బాలీవుడ్ ఫిలిం మేకర్స్లో వచ్చేసిందని.. అందుకే ఆయనతో వాళ్లు సినిమాలు చేయట్లేదని అన్నాడు. దీనికి రెహమాన్ బదులిస్తూ డబ్బులు పోతే వెనక్కి తెచ్చుకోవచ్చని.. కానీ మనం ప్రైం టైంను కోల్పోతే వెనక్కి తెచ్చుకోలేమని.. ఇలాంటివి పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్పిందే అన్నాడు.
ఇదిలా ఉంటే రెహమాన్తో పాటే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కు ఆస్కార్ అందుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పొకుట్టి లైన్లోకి వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఆస్కార్ గెలిచాక తనకు అవకాశాలు ఆగిపోయాయని.. తనతో పని చేయలేమని చాలామంది ముఖం మీదే చెప్పేశారని.. తాను పని లేక ఖాళీ అయిపోయాయని షాకింగ్ విషయం వెల్లడించాడు. మొత్తానికి ఆస్కార్ అవార్డులు గెలిస్తే కెరీర్ ఇంకా గొప్ప స్థాయికి చేరడం పోయి.. ఇలా దెబ్బతినడం ఆశ్చర్యం కలిగించే విషయం.
This post was last modified on July 27, 2020 3:13 pm
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…