ప్రాంతీయ భాషా చిత్రాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు ఒకేసారి రెండు గెలిచే స్థాయికి ఎదిగాడు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. ఇది భారతీయులు గర్వించదగ్గ విషయం.
ఐతే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో సంచలనం సృష్టించాక రెహమాన్ కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనుకుంటే అలా ఏమీ జరగలేదు. ఒకప్పటితో పోలిస్తే అతడికి అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్లో రెహమాన్ వెనుకబడిపోయాడు. ఇందుకు కారణాలేంటో ఎవరికీ అంతుబట్టలేదు.
ఐతే తాజాగా ‘దిల్ బేచారా’ మూవీతో మళ్లీ తనేంటో చాటి చెప్నాడు రెహమాన్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్లో తనకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ పని చేస్తోందంటూ సంచనల వ్యాఖ్యలు చేశాడు. ‘దిల్ బేచారా’ సినిమా కూడా తన చేతికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగినట్లు వెల్లడించాడు.
సౌమ్యుడు, వివాద రహితుడు అయిన రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపిింది. రెహమాన్ వ్యాఖ్యలపై లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్కు ఆస్కార్ అవార్డులు రావడమే శాపమైందన్నాడు. ఇతను మన స్థాయి దాటిపోయాడు.. మనం హ్యాండిల్ చేయలేం అనే భావన బాలీవుడ్ ఫిలిం మేకర్స్లో వచ్చేసిందని.. అందుకే ఆయనతో వాళ్లు సినిమాలు చేయట్లేదని అన్నాడు. దీనికి రెహమాన్ బదులిస్తూ డబ్బులు పోతే వెనక్కి తెచ్చుకోవచ్చని.. కానీ మనం ప్రైం టైంను కోల్పోతే వెనక్కి తెచ్చుకోలేమని.. ఇలాంటివి పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్పిందే అన్నాడు.
ఇదిలా ఉంటే రెహమాన్తో పాటే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కు ఆస్కార్ అందుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పొకుట్టి లైన్లోకి వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఆస్కార్ గెలిచాక తనకు అవకాశాలు ఆగిపోయాయని.. తనతో పని చేయలేమని చాలామంది ముఖం మీదే చెప్పేశారని.. తాను పని లేక ఖాళీ అయిపోయాయని షాకింగ్ విషయం వెల్లడించాడు. మొత్తానికి ఆస్కార్ అవార్డులు గెలిస్తే కెరీర్ ఇంకా గొప్ప స్థాయికి చేరడం పోయి.. ఇలా దెబ్బతినడం ఆశ్చర్యం కలిగించే విషయం.
This post was last modified on July 27, 2020 3:13 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…