Movie News

2023లో మైత్రి.. 2024లో శంక‌ర్?

ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రెండు సినిమాలు రిలీజ్ కావ‌డం.. అవి రెండూ ఇద్ద‌రు టాప్ స్టార్లు న‌టించిన‌ భారీ చిత్రాలు కావ‌డం.. పైగా అది సంక్రాంతి సీజ‌న్ కావ‌డం ఊహ‌కంద‌ని విష‌యం. 2023 సంక్రాంతికి ఇదే జ‌రిగింది.

మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీర‌య్య‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌తో వీర‌సింహారెడ్డి చిత్రాల‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌.. రెంటినీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసింది. ఇదే అరుదైన విష‌యం అంటే.. ఆ రెండు చిత్రాలూ బాక్సాపీస్ ద‌గ్గ‌ర మంచి ప‌లితాలు అందుకుని మైత్రీ వారికి లాభాలు తెచ్చిపెట్ట‌డం మ‌రో విశేషం. కాగా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఇలాంటి అరుదైన విష‌య‌మే జ‌ర‌గ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈసారి ఒకే ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి రెండు సినిమాలు వ‌స్తే.. వ‌చ్చే ఏడాది ఒకే ద‌ర్శ‌కుడి నుంచి రెండు సినిమాలు రిలీజ‌వుతాయ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడు శంక‌ర్ అని అంటున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఒకేసారి రెండు సినిమాలు తీస్తున్నారు. ఒక‌టి రామ్ చ‌ర‌ణ్‌తో దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న సినిమా కాగా.. ఇంకోటి ఎప్ప‌ట్నుంచో పెండింగ్‌లో ఉండి ఈ మ‌ధ్యే తిరిగి సెట్స్ మీదికి వెళ్లిన ఇండియ‌న్-2. ఈ సంక్రాంతికే అనుకున్న చ‌ర‌ణ్ సినిమా.. మ‌ధ్య‌లో ఇండియ‌న్-2 తెర‌పైకి రావ‌డం, ఇత‌ర కార‌ణాల‌ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఆ చిత్రాన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

మ‌రోవైపు ఇండియ‌న్-2 ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా సంస్థ అధినేత‌లు కూడా 2024 సంక్రాంతి మీదే క‌న్నేశారు. ఈ సినిమా పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్ అంతా అయ్యేస‌రికి ఈ ఏడాది గ‌డిచిపోతుంది. వ‌చ్చే సంక్రాంతే రిలీజ్‌కు స‌రైన‌టైమింగ్ అనుకుంటున్నారు. దర్శ‌కుడు ఒక‌డే అయిన‌ప్ప‌టికీ.. హీరోలు, నిర్మాత‌లు వేరు కాబ‌ట్టి ఎవ‌రిష్టం ఇక్క‌డ శంక‌ర్‌కు వ‌చ్చిన ఇబ్బంది లేదు. మ‌రి నిజంగానే ఈ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ‌వుతాయేమో చూడాలి.

This post was last modified on February 28, 2023 10:04 am

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

20 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago