నటి, యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో తరచుగా నెటిజన్లతో డిష్యుం డిష్యుం నడుస్తుంటుంది. సెలబ్రెటీల మీద సోషల్ మీడియాలో ఊరూ పేరు లేని వాళ్లు పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం మామూలే. చాలామంది ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కానీ అనసూయ ఆ టైపు కాదు. తను పెట్టే పోస్టుల మీద ఎవరైనా నెగెటివ్ కామెంట్లు చేస్తే వాళ్లకు ఆమె దీటుగా బదులిస్తుంటుంది. అవతలి వాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంటారు. ఆమె వైపు నెగెటివ్ పాయింట్లు పట్టుకుని ట్రోల్ చేస్తుంటారు.
కొన్ని నెలల కిందట అనసూయను ఒక నెటిజన్ ఆంటీ అనడం.. అందుకు ఆమె హర్టయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఆ తర్వాత అదే పనిగా కొందరు ఆంటీ ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేయడం తెలిసిందే. ఆంటీ అంటే ఎందుకు ఫీలవుతారో తెలియదు అంటూ ఆమె పాత కామెంట్లను పట్టుకుని కౌంటర్లు ఇచ్చింది ఆ వర్గం.
ఈ ‘ఆంటీ’ గొడవ ఎంత వరకు వెళ్లిందంటే.. థియేటర్లలో ఏదైనా సినిమాల్లో అనసూయ పాత్ర కనిపిస్తే ఆంటీ ఆంటీ అని కుర్రాళ్లు అరిచే స్థాయికి వెళ్లింది. అనసూయను ఇలా సంబోధించడంపై సీనియర్ నటి కస్తూరి ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఆమెకు మద్దతుగా కస్తూరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
“చిన్న పిల్లలు ఆంటీ అనడానికి, కొంచెం వయసు వచ్చిన వాళ్లు అలా అనడానికి తేడా ఉంటుంది. చిన్నపిల్లలు గౌరవంతో పిలుస్తారు. పెద్ద వయసు వాళ్లు ఒక మహిళను అలా అంటున్నారంటే అది సరైన పద్ధతి కాదు. అనసూయను ఆంటీ అని కామెంట్ చేయడం తప్పు. ఇండస్ట్రీలో ఆమె కంటే పెద్ద వయసు నటులున్నారు. వాళ్లను అ:కుల్ అని పిలుస్తున్నారా? ఆంటీ అనే పదానికి ఈ మధ్య చెత్త అర్థాలు వచ్చాయి. అనసూయను ఆంటీ అంటున్నారంటే దురుద్దేశంతో అయినా అయ్యుండాలి.. లేదా ఆమెను అగౌరవపరచాలనే అంటుండాలి” అని కస్తూరి అంది. మరోవైపు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు హాజరైనపుడు ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడడంలోనూ తప్పేమీ లేదని.. అతణ్ని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కస్తూరి అభిప్రాయపడింది.
This post was last modified on February 27, 2023 10:40 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…