సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఒడుదొడుకులతో సాగుతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత నెల రోజుల వ్యవధిలో ఒక్క ‘రైటర్ పద్మభూషణ్’ మాత్రమే సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత శివరాత్రి వీకెండ్లో రిలీజైన ‘సార్’ మంచి ఫలితాన్నే అందుకోగా.. అదే వారాంతంలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కూడా పర్వాలేదనిపించింది. కానీ ఈ వీకెండ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా వెలవెలబోయింది.
గత వారం థియేటర్లు బోలెడన్ని అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోవడానికి చెప్పుకోదగ్గ కొత్త సినిమా ఒకటీ లేదు. ఊరూ పేరూ లేని సినిమాలేవో వచ్చాయి వెళ్లిపోయాయి. ఇక తర్వాతి వారం కూడా బాక్సాఫీస్ కళ తప్పేలాగే కనిపిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘బలగం’ అనే చిన్న సినిమా తప్ప చెప్పుకోదగ్గ రిలీజ్లు ఉండే అవకాశం కనిపించడం లేదు.
ఇది అన్ సీజనే అయినప్పటికీ.. రెగ్యులర్ సినీ గోయర్స్ ఏ కొత్త సినిమా వచ్చినా చూడడ్డానికి రెడీగా ఉంటారు. మంచి టాక్ తెచ్చుకుని ఈ టైంలో కూడా బాగా ఆడిన సినిమాలు లేకపోలేదు. కానీ పోటీయే లేని ఈ సమయాన్ని ఉపయోగించుకునే సినిమా కనిపించడం లేదు. ‘బలగం’ కూడా ఛాన్స్ను వాడుకోవట్లేదు. దిల్ రాజు నిర్మించాడంటే ప్రమోషన్ల పరంగా కొంచెం హడావుడి ఉండాలి. బజ్ పెంచాలి. కానీ ‘బలగం’కు స్టార్ కాస్ట్ లేకపోవడం, ఇదేదో తెలంగాణ సినిమా అనే ముద్ర పడిపోవడం వల్ల మొత్తంగా అనుకున్నంత బజ్ రాలేదు.
యూత్ను ఆకర్షించేలా ప్రోమోలు ఇప్పటిదాకా ఏవీ రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ వీక్లో అయినా జోరు పెంచాల్సిన అవసరముంది. ఈ చిత్రంతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. ఈ చిత్రంలో ప్రియదర్శి సహా తెలంగాణ నటీనటులే ముఖ్య పాత్రలను పోషించారు.
This post was last modified on February 26, 2023 9:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…