సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఒడుదొడుకులతో సాగుతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత నెల రోజుల వ్యవధిలో ఒక్క ‘రైటర్ పద్మభూషణ్’ మాత్రమే సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత శివరాత్రి వీకెండ్లో రిలీజైన ‘సార్’ మంచి ఫలితాన్నే అందుకోగా.. అదే వారాంతంలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కూడా పర్వాలేదనిపించింది. కానీ ఈ వీకెండ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా వెలవెలబోయింది.
గత వారం థియేటర్లు బోలెడన్ని అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోవడానికి చెప్పుకోదగ్గ కొత్త సినిమా ఒకటీ లేదు. ఊరూ పేరూ లేని సినిమాలేవో వచ్చాయి వెళ్లిపోయాయి. ఇక తర్వాతి వారం కూడా బాక్సాఫీస్ కళ తప్పేలాగే కనిపిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘బలగం’ అనే చిన్న సినిమా తప్ప చెప్పుకోదగ్గ రిలీజ్లు ఉండే అవకాశం కనిపించడం లేదు.
ఇది అన్ సీజనే అయినప్పటికీ.. రెగ్యులర్ సినీ గోయర్స్ ఏ కొత్త సినిమా వచ్చినా చూడడ్డానికి రెడీగా ఉంటారు. మంచి టాక్ తెచ్చుకుని ఈ టైంలో కూడా బాగా ఆడిన సినిమాలు లేకపోలేదు. కానీ పోటీయే లేని ఈ సమయాన్ని ఉపయోగించుకునే సినిమా కనిపించడం లేదు. ‘బలగం’ కూడా ఛాన్స్ను వాడుకోవట్లేదు. దిల్ రాజు నిర్మించాడంటే ప్రమోషన్ల పరంగా కొంచెం హడావుడి ఉండాలి. బజ్ పెంచాలి. కానీ ‘బలగం’కు స్టార్ కాస్ట్ లేకపోవడం, ఇదేదో తెలంగాణ సినిమా అనే ముద్ర పడిపోవడం వల్ల మొత్తంగా అనుకున్నంత బజ్ రాలేదు.
యూత్ను ఆకర్షించేలా ప్రోమోలు ఇప్పటిదాకా ఏవీ రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ వీక్లో అయినా జోరు పెంచాల్సిన అవసరముంది. ఈ చిత్రంతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. ఈ చిత్రంలో ప్రియదర్శి సహా తెలంగాణ నటీనటులే ముఖ్య పాత్రలను పోషించారు.
This post was last modified on February 26, 2023 9:39 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…