సీనియర్ హీరో అర్జున్ కేవలం నటుడే కాదు.. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. జైహింద్ సహా పలు చిత్రాలకు తనే స్క్రిప్టు సమకూర్చుకుని డైరెక్ట్ చేశాడు అర్జున్. తన సినిమాలు కొన్నింటిని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్నాడు కూడా. ఐతే చాలా ఏళ్లుగా అర్జున్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావట్లేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని.. స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీయడానికి గత ఏడాది ప్రణాళిక వేసుకున్నాడు. ఆ సినిమాలో తెలుగు యువ కథానాయకుడు విశ్వక్సేన్ను హీరోగా తీసుకున్నాడు. తన కూతురు ఐశ్వర్యనే కథానాయికగా ఎంచుకున్నాడు.
ఐతే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ద్విభాషా చిత్రం.. మధ్యలో ఆగిపోయింది. స్క్రిప్టు నచ్చకో, అర్జున్తో పొత్తు కుదరకో.. విశ్వక్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. దీని మీద తీవ్ర ఆవేదనతో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. తర్వాత విశ్వక్ తన వైపు నుంచి ఏదో వివరణ ఇచ్చాడు.
మొత్తానికి ఆ సినిమా అక్కడితో అటకెక్కేసినట్లే కనిపించింది. విశ్వక్ స్థానంలో వేరే హీరో ఎవరినీ ఎంచుకోలేదు. ఈ సినిమాను ముందుకూ తీసుకెళ్లలేదు. కట్ చేస్తే ఇప్పుడు అర్జున్ ఒక సూపర్ స్టార్ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో టాప్ స్టార్ అయిన మోహన్ లాల్ హీరోగా అర్జున్ ఓ బహు భాషా చిత్రాన్ని తీయబోతున్నాడట.
లాల్ పెద్ద స్టారే కానీ.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేయడం, నాన్చడం ఏమీ ఉండదు. చకచకా కొన్ని నెలల్లోనే ఒక సినిమా లాగించేస్తుంటాడు. చిన్న, పెద్ద.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరు దర్శకులతోనూ పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన అర్జున్తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అర్జున్ స్టయిల్లోనే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. విశ్వక్ మిస్సయినా లాల్ లాంటి టాప్ హీరోను ఒప్పించాడంటే అర్జున్ సమర్థుడే.
This post was last modified on February 26, 2023 9:21 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…