సీనియర్ హీరో అర్జున్ కేవలం నటుడే కాదు.. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. జైహింద్ సహా పలు చిత్రాలకు తనే స్క్రిప్టు సమకూర్చుకుని డైరెక్ట్ చేశాడు అర్జున్. తన సినిమాలు కొన్నింటిని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్నాడు కూడా. ఐతే చాలా ఏళ్లుగా అర్జున్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావట్లేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని.. స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీయడానికి గత ఏడాది ప్రణాళిక వేసుకున్నాడు. ఆ సినిమాలో తెలుగు యువ కథానాయకుడు విశ్వక్సేన్ను హీరోగా తీసుకున్నాడు. తన కూతురు ఐశ్వర్యనే కథానాయికగా ఎంచుకున్నాడు.
ఐతే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ద్విభాషా చిత్రం.. మధ్యలో ఆగిపోయింది. స్క్రిప్టు నచ్చకో, అర్జున్తో పొత్తు కుదరకో.. విశ్వక్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. దీని మీద తీవ్ర ఆవేదనతో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. తర్వాత విశ్వక్ తన వైపు నుంచి ఏదో వివరణ ఇచ్చాడు.
మొత్తానికి ఆ సినిమా అక్కడితో అటకెక్కేసినట్లే కనిపించింది. విశ్వక్ స్థానంలో వేరే హీరో ఎవరినీ ఎంచుకోలేదు. ఈ సినిమాను ముందుకూ తీసుకెళ్లలేదు. కట్ చేస్తే ఇప్పుడు అర్జున్ ఒక సూపర్ స్టార్ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో టాప్ స్టార్ అయిన మోహన్ లాల్ హీరోగా అర్జున్ ఓ బహు భాషా చిత్రాన్ని తీయబోతున్నాడట.
లాల్ పెద్ద స్టారే కానీ.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేయడం, నాన్చడం ఏమీ ఉండదు. చకచకా కొన్ని నెలల్లోనే ఒక సినిమా లాగించేస్తుంటాడు. చిన్న, పెద్ద.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరు దర్శకులతోనూ పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన అర్జున్తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అర్జున్ స్టయిల్లోనే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. విశ్వక్ మిస్సయినా లాల్ లాంటి టాప్ హీరోను ఒప్పించాడంటే అర్జున్ సమర్థుడే.
This post was last modified on February 26, 2023 9:21 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…