సీనియర్ హీరో అర్జున్ కేవలం నటుడే కాదు.. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. జైహింద్ సహా పలు చిత్రాలకు తనే స్క్రిప్టు సమకూర్చుకుని డైరెక్ట్ చేశాడు అర్జున్. తన సినిమాలు కొన్నింటిని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్నాడు కూడా. ఐతే చాలా ఏళ్లుగా అర్జున్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావట్లేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని.. స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీయడానికి గత ఏడాది ప్రణాళిక వేసుకున్నాడు. ఆ సినిమాలో తెలుగు యువ కథానాయకుడు విశ్వక్సేన్ను హీరోగా తీసుకున్నాడు. తన కూతురు ఐశ్వర్యనే కథానాయికగా ఎంచుకున్నాడు.
ఐతే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ద్విభాషా చిత్రం.. మధ్యలో ఆగిపోయింది. స్క్రిప్టు నచ్చకో, అర్జున్తో పొత్తు కుదరకో.. విశ్వక్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. దీని మీద తీవ్ర ఆవేదనతో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. తర్వాత విశ్వక్ తన వైపు నుంచి ఏదో వివరణ ఇచ్చాడు.
మొత్తానికి ఆ సినిమా అక్కడితో అటకెక్కేసినట్లే కనిపించింది. విశ్వక్ స్థానంలో వేరే హీరో ఎవరినీ ఎంచుకోలేదు. ఈ సినిమాను ముందుకూ తీసుకెళ్లలేదు. కట్ చేస్తే ఇప్పుడు అర్జున్ ఒక సూపర్ స్టార్ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో టాప్ స్టార్ అయిన మోహన్ లాల్ హీరోగా అర్జున్ ఓ బహు భాషా చిత్రాన్ని తీయబోతున్నాడట.
లాల్ పెద్ద స్టారే కానీ.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేయడం, నాన్చడం ఏమీ ఉండదు. చకచకా కొన్ని నెలల్లోనే ఒక సినిమా లాగించేస్తుంటాడు. చిన్న, పెద్ద.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరు దర్శకులతోనూ పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన అర్జున్తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అర్జున్ స్టయిల్లోనే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. విశ్వక్ మిస్సయినా లాల్ లాంటి టాప్ హీరోను ఒప్పించాడంటే అర్జున్ సమర్థుడే.
This post was last modified on February 26, 2023 9:21 am
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…
మెగాస్టార్ చిరంజీవి చివరి సినిమా ‘భోళా శంకర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దీంతో చిరు తర్వాతి సినిమా…