ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత ఆ స్థాయి భారీతనం, శ్రమ, విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ సినిమా అంటే ప్రాజెక్ట్-కేనే. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్.. అశ్వినీదత్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లు కావడం విశేషం.
ఆదిత్య 369 తరహాలో సోషియో ఫాంటసీ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ మూవీగా దీన్ని చెబుతున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని విధంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
2024 జనవరి 12న సినిమా విడుదలవుతుందని వెల్లడించారు. ఐతే ప్రభాస్ ఒకేసారి పలు చిత్రాల్లో నటిస్తున్న నేపథ్యంలో ఇంత భారీ చిత్రం నిజంగా ఆ సమయానికి పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్న సందేహాలున్నాయి.
కానీ ఈ విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని నిర్మాత అశ్వినీదత్ తేల్చేశాడు. సినిమా షూటింగ్ విషయమై ఆయన కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించారు. ఇంకా విడుదలకు పది నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇంకో 30 శాతం చిత్రీకరణ.. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్కు బాగానే సమయం ఉన్నట్లే.
ఈ సినిమా వీఎఫెక్స్ పనులు ప్రసిద్ధి చెందిన ఐదారు స్టూడియోల్లో జరుగుతున్నాయని.. ఆ ఎఫెక్ట్స్ తెరపై చూసినపుడు నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటాయని దత్ చెప్పారు. ప్రేక్షకులు ఇప్పటిదా చూడని సరికొత్త అనుభూతిని ప్రాజెక్ట్-కే చూస్తన్నపుడు పొందుతారని ఆయనన్నారు.
సినిమాలో ప్రభాస్ తర్వాత దీపిక, అమితాబ్లకు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని.. చాలా సన్నివేశాల్లో ఈ ముగ్గురి పాత్రలు ఉంటాయని దత్ తెలిపారు. తమ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కినా ఇందులో ఎమోషన్లు, సెంటిమెంట్ కూడా ఉంటాయని ఆయన చెప్పడం విశేషం.
This post was last modified on February 26, 2023 8:51 am
నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి…
జూలై అయిపోయింది. వేసవిలో ఎండల బాలన్స్ ఏదైనా ఉందంటే ఈ నెలతో సమాప్తం అయినట్టే. ఆల్రెడీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను…
పేపర్ లీకేజి భూతం ఒదిలిపెట్టేలా కనిపించడం లేదు. కేంద్ర విద్యా శాఖ మంత్రిని పదవిని బలిగొన్నా అక్రమార్కులు వెనకంజ వేయడం…
నిత్యం పాఠశాలల్లోనూ.. జాతీయ పండుగల దినాల్లోనూ అందరూ కలసి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక, చట్టబద్ధం కానుంది. దీనికి…
పరామర్శలు చేయడం తప్పుకాదు. పార్టీని కాపాడుకోవడమూ తప్పుకాదు. కానీ, ఎవరిని పరామర్శించాలన్న విషయంలోనే పార్టీలు విజ్ఞతతో ముందుకు సాగాలి. ఈ…
భారీ అంచనాలు కాదు కానీ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం మీద ఆడియన్స్ లో…