Movie News

ప్రాజెక్ట్‌-కే షూటింగ్ ఎంత అయింది?

ప్ర‌భాస్ కెరీర్లో బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి భారీత‌నం, శ్ర‌మ‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ సినిమా అంటే ప్రాజెక్ట్‌-కేనే. మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.. అశ్వినీద‌త్ నిర్మాణంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని బ‌డ్జెట్ ఏకంగా రూ.500 కోట్లు కావ‌డం విశేషం.

ఆదిత్య 369 త‌ర‌హాలో సోషియో ఫాంట‌సీ ట‌చ్ ఉన్న సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా దీన్ని చెబుతున్నారు. హాలీవుడ్ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

2024 జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌వుతుంద‌ని వెల్ల‌డించారు. ఐతే ప్ర‌భాస్ ఒకేసారి ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న నేప‌థ్యంలో ఇంత భారీ చిత్రం నిజంగా ఆ స‌మ‌యానికి పూర్త‌యి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా అన్న సందేహాలున్నాయి.

కానీ ఈ విష‌యంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన ప‌ని లేద‌ని నిర్మాత అశ్వినీద‌త్ తేల్చేశాడు. సినిమా షూటింగ్ విష‌య‌మై ఆయ‌న కీల‌క‌మైన అప్‌డేట్ ఇచ్చారు. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించారు. ఇంకా విడుద‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇంకో 30 శాతం చిత్రీక‌ర‌ణ‌.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, ప్ర‌మోష‌న్‌కు బాగానే స‌మ‌యం ఉన్న‌ట్లే.

ఈ సినిమా వీఎఫెక్స్ ప‌నులు ప్ర‌సిద్ధి చెందిన ఐదారు స్టూడియోల్లో జ‌రుగుతున్నాయ‌ని.. ఆ ఎఫెక్ట్స్ తెర‌పై చూసిన‌పుడు న‌భూతో న‌భవిష్య‌తి అన్న‌ట్లుగా ఉంటాయ‌ని ద‌త్ చెప్పారు. ప్రేక్ష‌కులు ఇప్పటిదా చూడ‌ని స‌రికొత్త అనుభూతిని ప్రాజెక్ట్‌-కే చూస్త‌న్న‌పుడు పొందుతార‌ని ఆయ‌న‌న్నారు.

సినిమాలో ప్ర‌భాస్ త‌ర్వాత దీపిక‌, అమితాబ్‌ల‌కు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంద‌ని.. చాలా స‌న్నివేశాల్లో ఈ ముగ్గురి పాత్ర‌లు ఉంటాయ‌ని ద‌త్ తెలిపారు. త‌మ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్లో తెర‌కెక్కినా ఇందులో ఎమోష‌న్లు, సెంటిమెంట్ కూడా ఉంటాయ‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం.

This post was last modified on February 26, 2023 8:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago