క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా చెలామణి కావడం అరుదు. విలన్లు పెద్ద స్థాయికి వెళ్ళినవాళ్ళు చాలానే ఉన్నారు. మోహన్ బాబుతో మొదలుపెట్టి గోపిచంద్ దాకా స్టార్లుగా ఎదగడం చూస్తున్నాం. అయితే యాభై నాలుగేళ్ల వయసులో మొదటిసారి టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ రావడం చిన్న విషయం కాదు. రావు రమేష్ కి ఆ అవకాశం దక్కింది. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పేరుతో రూపొందబోయే కామెడీ ఎంటర్ టైనర్ లో హీరోగా నటించబోతున్నారు. ఇంద్రజ ఆయనకు జోడీగా కనిపిస్తారు. నీహారికతో హ్యాపీ వెడ్డింగ్ తీసిన లక్ష్మణ్ కార్య దీనికి దర్శకుడు.
వినడానికి బాగానే ఉంది కానీ సోలోగా రావు రమేష్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే ఔనని చెప్పలేం. ఎంత హాస్యపూరిత చిత్రమే అయినా రెగ్యులర్ గా సపోర్టింగ్ రోల్స్ లో చూసిన జనాలకు హఠాత్తుగా ఆయన్ని అంత పెద్ద పాత్రలో రెండు గంటల పాటు చూపించడం సవాలే. ఒకప్పుడు తండ్రి రావుగోపాలరావు గారు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కలియుగ రావణాసురుడు లాంటి చిత్రాలు చేశారు. అయితే అవన్నీ నెగటివ్ షేడ్స్ లో సాగేవి. కానీ ఈ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మొదటి నుంచి చివరిదాకా నవ్విస్తూనే ఉంటాడట.
కెజిఎఫ్ చేశాక రావు రమేష్ కి ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ మంచి గుర్తింపు వచ్చింది. సినిమాకింత రెమ్యునరేషన్ నుంచి రోజుకింతని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. అసలే ఓటిటి జమానా. పబ్లిక్ ని టికెట్లు కొనేలా చేయడం పెద్ద హీరోలకే సవాల్ గా మారిపోయింది. అలాంటిది ఎంత గొప్ప నటుడైనా సరే ఇలా ఫిఫ్టీ ఏజ్ తర్వాత కథానాయకుడిగా మార్చడమంటే ఒకరకంగా సాహసమే. కమెడియన్ టు హీరోస్ గా సక్సెస్ అయినవాళ్లలో అలీ, బాబు మోహన్, సునీల్ లాంటి వాళ్ళు చాలానే ఉన్నారు కానీ రావు రమేష్ కు మాత్రం ఇదో రకంగా కొత్త సవాలే.
This post was last modified on February 24, 2023 4:18 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…