థియేటర్లలో మాత్రమే సినిమాలు విడుదలవ్వాలని, ఓటిటిలో చిన్న సినిమాలు చేసుకుంటే చేసుకోండని, పది కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలైనా థియేటర్లలో విడుదలవ్వాలని సాంప్రదాయవాదులైన నిర్మాతలు వాదిస్తున్నారు. అంతే కాదు ఓటిటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్న సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేస్తామనే చెబుతున్నారు.
ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలైతే ఓటిటి అంటేనే చిన్నతనంగా భావిస్తున్నారు. ట్రెండ్ ని ఫాలో అవుతాడని పేరున్న నాగార్జున ఓటిటి ట్రెండ్ కి స్వాగతం చెబుతారనే ఉద్దేశంతో ఆయనను వైల్డ్ డాగ్, అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఓటిటి హక్కుల కోసం సంప్రదించారట. మాములుగా కూల్ గా ఉండే నాగ్ ఈ ఎంక్వయిరీతో చాలా ఫైర్ అయ్యారట.
అసలే అఖిల్ కెరీర్ ని ఒక గాడిన పెట్టాలని తపిస్తున్నారో ఏమో… అతని సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేయాలనే ప్రపోజల్ ఆయనకు కోపం తెప్పించింది. తెలుగు సినిమా వరకు ఇప్పట్లో ఓటిటిని ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితి లేదు. థియేటర్లు ఎలాగో ఆగష్టు నెలాఖరుకి ఓపెన్ అవుతాయనే సంకేతాలు అందుతూ ఉండడంతో నిర్మాతలు ఓపిక పడుతున్నారు.
This post was last modified on July 26, 2020 4:34 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…