థియేటర్లలో మాత్రమే సినిమాలు విడుదలవ్వాలని, ఓటిటిలో చిన్న సినిమాలు చేసుకుంటే చేసుకోండని, పది కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలైనా థియేటర్లలో విడుదలవ్వాలని సాంప్రదాయవాదులైన నిర్మాతలు వాదిస్తున్నారు. అంతే కాదు ఓటిటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్న సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేస్తామనే చెబుతున్నారు.
ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలైతే ఓటిటి అంటేనే చిన్నతనంగా భావిస్తున్నారు. ట్రెండ్ ని ఫాలో అవుతాడని పేరున్న నాగార్జున ఓటిటి ట్రెండ్ కి స్వాగతం చెబుతారనే ఉద్దేశంతో ఆయనను వైల్డ్ డాగ్, అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఓటిటి హక్కుల కోసం సంప్రదించారట. మాములుగా కూల్ గా ఉండే నాగ్ ఈ ఎంక్వయిరీతో చాలా ఫైర్ అయ్యారట.
అసలే అఖిల్ కెరీర్ ని ఒక గాడిన పెట్టాలని తపిస్తున్నారో ఏమో… అతని సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేయాలనే ప్రపోజల్ ఆయనకు కోపం తెప్పించింది. తెలుగు సినిమా వరకు ఇప్పట్లో ఓటిటిని ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితి లేదు. థియేటర్లు ఎలాగో ఆగష్టు నెలాఖరుకి ఓపెన్ అవుతాయనే సంకేతాలు అందుతూ ఉండడంతో నిర్మాతలు ఓపిక పడుతున్నారు.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…