థియేటర్లలో మాత్రమే సినిమాలు విడుదలవ్వాలని, ఓటిటిలో చిన్న సినిమాలు చేసుకుంటే చేసుకోండని, పది కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలైనా థియేటర్లలో విడుదలవ్వాలని సాంప్రదాయవాదులైన నిర్మాతలు వాదిస్తున్నారు. అంతే కాదు ఓటిటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్న సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేస్తామనే చెబుతున్నారు.
ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలైతే ఓటిటి అంటేనే చిన్నతనంగా భావిస్తున్నారు. ట్రెండ్ ని ఫాలో అవుతాడని పేరున్న నాగార్జున ఓటిటి ట్రెండ్ కి స్వాగతం చెబుతారనే ఉద్దేశంతో ఆయనను వైల్డ్ డాగ్, అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఓటిటి హక్కుల కోసం సంప్రదించారట. మాములుగా కూల్ గా ఉండే నాగ్ ఈ ఎంక్వయిరీతో చాలా ఫైర్ అయ్యారట.
అసలే అఖిల్ కెరీర్ ని ఒక గాడిన పెట్టాలని తపిస్తున్నారో ఏమో… అతని సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేయాలనే ప్రపోజల్ ఆయనకు కోపం తెప్పించింది. తెలుగు సినిమా వరకు ఇప్పట్లో ఓటిటిని ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితి లేదు. థియేటర్లు ఎలాగో ఆగష్టు నెలాఖరుకి ఓపెన్ అవుతాయనే సంకేతాలు అందుతూ ఉండడంతో నిర్మాతలు ఓపిక పడుతున్నారు.
This post was last modified on July 26, 2020 4:34 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…