హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు వాడే బిరుదుని టైటిల్ లో పెట్టుకోవడం పట్ల తొలుత ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అదేమంత ఇష్యూ కాలేదు. తాజాగా ఇందులో సగం పేరుని వాడేసుకుని ఓ అప్ కమింగ్ హీరో వచ్చేస్తున్నాడు. సింహా కోడూరి నటించిన కొత్త చిత్రానికి ఉస్తాద్ గా నామకరణం చేసి ఇవాళ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ పైలట్ గా సింహా నటిస్తున్న ఈ బయోపిక్ ఎవరి కథ ఆధారంగా రూపొందిందనేది ఇంకా రివీల్ కాలేదు.
వారాహి బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించిన ఉస్తాద్ కి ఫణిదీప్ దర్శకత్వం వహించగా అకీవా సంగీతం సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నప్పటికీ సింహ కోడూరికి ఆశించిన సక్సెస్ లు రావడం లేదు. మత్తు వదలరా హిట్ తర్వాత వరస పరాజయాలు పలకరించాయి. తెల్లవారితే గురువారం డిజాస్టర్ అయ్యింది. దొంగలున్నారు జాగ్రత్త కనీసం రెండు రోజులు కూడా ఆడలేక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయేవి విజయం సాధించడం కీలకంగా మారింది. అసలే కుర్రహీరోలకు బాక్సాఫీస్ వద్ద కలిసి రావడం లేదు.
ఈ ఉస్తాద్ తో పాటు భాగ్ సాలె కూడా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.టైటిల్ అయితే చెప్పేశారు కానీ ఇటు పవన్ ఫ్యాన్స్ అటు రామ్ అభిమానులు ఇద్దరూ పెట్టుకోవడానికి ఈ ట్యాగే దొరికిందాని కామెంట్లతో నిలదీస్తున్నారు. సినిమా చూడకుండా ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదు కానీ ఈ మధ్య ఇలాంటివి కొద్దిరోజులు హడావిడి చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ గా జరుగుతోంది. నాని గ్యాంగ్ లీడర్ టైంలో మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ గుర్తేగా. అయినా ఉస్తాద్ లాంటి పవర్ ఫుల్ ఎలివేషన్లు ఇలాంటి అప్ కమింగ్ హీరోకు ఎంతమేరకు సెట్ అవుతాయో చూడాలి.
This post was last modified on February 23, 2023 12:30 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…