హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు వాడే బిరుదుని టైటిల్ లో పెట్టుకోవడం పట్ల తొలుత ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అదేమంత ఇష్యూ కాలేదు. తాజాగా ఇందులో సగం పేరుని వాడేసుకుని ఓ అప్ కమింగ్ హీరో వచ్చేస్తున్నాడు. సింహా కోడూరి నటించిన కొత్త చిత్రానికి ఉస్తాద్ గా నామకరణం చేసి ఇవాళ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ పైలట్ గా సింహా నటిస్తున్న ఈ బయోపిక్ ఎవరి కథ ఆధారంగా రూపొందిందనేది ఇంకా రివీల్ కాలేదు.
వారాహి బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించిన ఉస్తాద్ కి ఫణిదీప్ దర్శకత్వం వహించగా అకీవా సంగీతం సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నప్పటికీ సింహ కోడూరికి ఆశించిన సక్సెస్ లు రావడం లేదు. మత్తు వదలరా హిట్ తర్వాత వరస పరాజయాలు పలకరించాయి. తెల్లవారితే గురువారం డిజాస్టర్ అయ్యింది. దొంగలున్నారు జాగ్రత్త కనీసం రెండు రోజులు కూడా ఆడలేక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయేవి విజయం సాధించడం కీలకంగా మారింది. అసలే కుర్రహీరోలకు బాక్సాఫీస్ వద్ద కలిసి రావడం లేదు.
ఈ ఉస్తాద్ తో పాటు భాగ్ సాలె కూడా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.టైటిల్ అయితే చెప్పేశారు కానీ ఇటు పవన్ ఫ్యాన్స్ అటు రామ్ అభిమానులు ఇద్దరూ పెట్టుకోవడానికి ఈ ట్యాగే దొరికిందాని కామెంట్లతో నిలదీస్తున్నారు. సినిమా చూడకుండా ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదు కానీ ఈ మధ్య ఇలాంటివి కొద్దిరోజులు హడావిడి చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ గా జరుగుతోంది. నాని గ్యాంగ్ లీడర్ టైంలో మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ గుర్తేగా. అయినా ఉస్తాద్ లాంటి పవర్ ఫుల్ ఎలివేషన్లు ఇలాంటి అప్ కమింగ్ హీరోకు ఎంతమేరకు సెట్ అవుతాయో చూడాలి.
This post was last modified on February 23, 2023 12:30 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…