పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల ఓపెనింగ్స్ లో మరో కొత్త చాఫ్టర్ ఇవాళ మొదలయ్యింది. ఏడాదికిపైగా అదిగో ఇదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన వినోదయ సితం రీమేక్ ఎట్టకేలకు ఈ రోజు అధికారికంగా పట్టాలు ఎక్కింది. మొదటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఏమంత ఆసక్తి చూపించడం లేదు. కారణం ఓటిటి రిలీజ్ అయిన మూవీ అందులోనూ స్టార్ హీరోలు లేనిది పవన్ ఏరికోరి చేయడం ఏమిటని వాళ్ళ నిలదీత. అందులో లాజిక్ ఉంది కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరి ఇమేజ్ కి తగ్గట్టు చాలానే మార్పులు చేశారట.
కేవలం ఇరవై రోజుల కాల్ షీట్స్ తో మొత్తం షూటింగ్ పూర్తి చేస్తారనే టాక్ ఉంది. దర్శకుడు సముతిరఖని ఒరిజినల్ వెర్షన్ లో సోల్ మిస్ కాకుండా చేసుకున్న మార్పులకు అనుగుణంగా మంచి అవుట్ ఫుట్ వచ్చేలా తీస్తానని హామీ ఇచ్చారట. వాస్తవానికి వినోదయ సితం లైన్ బాగుంటుంది. సమస్యల్లో చిక్కుకున్న ఓ మధ్యతరగతి జీవితంలోకి మనిషి రూపంలో టైం వస్తుంది. విధిరాతని స్వంతంగా రాసుకునే ఛాన్స్ ఇస్తుంది. ఆ పాత్రే పవన్ చేస్తోంది. ఆ ఉద్యోగిగా సాయి ధరమ్ తేజ్ కనిపిస్తాడు. తమిళంలో ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్ తంబీరామయ్య చేశారు. ఇక్కడ హీరోయిన్ ని జోడించారు.
మామా అల్లుడు కలిసి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత తమన్ ముచ్చటగా మూడోసారి పవన్ కి సంగీతం అందిస్తుండగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవిలోనే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. దీని కోసమే హరిహరవీరమల్లుకి బ్రేక్ వేయడంతో పాటు తన హెయిర్ స్టైల్ ని పవన్ కళ్యాణ్ మార్చుకున్నారు. కొంత గోపాల గోపాలలో చేసిన కృష్ణుడి క్యారెక్టర్ కి దగ్గరగా ఉన్నా కాన్సెప్ట్ పరంగా వినోదయ సితం ఆసక్తికరంగా సాగుతుంది. తెలుగు టైటిల్ ని ఇంకా ఖరారు చేయలేదు.
This post was last modified on February 22, 2023 10:42 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…