ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం ఒకింత సహనాన్ని కోల్పోయాడు. నిన్న సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్ లో ఒక ట్విట్టర్ బ్యాచ్ కావాలనే తనను టార్గెట్ చేస్తోందని ఎవరెంత ట్రై చేసినా తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. ఎక్కడో మన భాషతో సంబంధం లేని వాళ్ళు పూణే నుంచి సినిమా ఎలా చూస్తారని అడుగుతూ, దాంతో పాటు నెగటివ్ టాక్ ప్రచారం చేయడం పట్ల విచారణ వ్యక్తం చేశాడు. మనకన్నా ముందే యుఎస్ ప్రీమియర్లు పడుతున్న ట్రెండ్ లో ఇలాంటి ప్రశ్న అడగటం సింక్ అవ్వలేదు కానీ కుర్రాడి మాటల్లో బాధ కనిపించింది.
కిరణ్ గత మూడు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా నేను మీకు బాగా కావాల్సినవాడిని చాలా డ్యామేజ్ చేసింది. ఆ గాయాన్ని వినరో భాగ్యము విష్ణుకథ మాన్పుతుందనే బలమైన నమ్మకాన్ని కిరణ్ ముందు నుంచి వ్యక్తం చేస్తూ వచ్చాడు. అయితే కలెక్షన్లు మరీ భారీగా లేవు కానీ గత చిత్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్న మాట వాస్తవమే. అయితే హఠాత్తుగా బ్లాక్ బస్టరని ఇప్పటికిప్పుడు చెప్పేంత స్థాయిలో దూకుడైతే లేదు. సార్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో కిరణ్ మూవీకొచ్చిన డివైడ్ టాక్ ని పూర్తిగా తప్పనలేం.
సమ్మతమే కూడా నిర్మాతకు మంచి లాభాలు ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా హిట్టని చెప్పే ప్రయత్నం చేశాడు కిరణ్. ఇవన్నీ ఎలా ఉన్నా ఏదో ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనే ట్రోల్స్ వస్తున్నాయని వాటి మీద పబ్లిక్ స్టేజి మీద ఇంతగా స్పందించడం అప్ కమింగ్ హీరోలకు లేనిపోని తలనెప్పులు తెచ్చేదే. వద్దన్న రచ్చని ఎక్కువ చేయడంలో సోషల్ మీడియా జనాలు ముందుంటారు. ఆ మధ్య మంచు విష్ణు ఎంతగా ఇబ్బంది పడ్డాడో చూశాం. సైలెంట్ గా ఉంటేనే ఇలాంటివి ఆగుతాయి తప్పించి రెస్పాన్స్ ఇచ్చేకొద్దీ ఎక్కువవుతాయి కానీ తగ్గవు.
This post was last modified on February 22, 2023 9:59 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…