Political News

ఆ నలుగిరిపై 26న ఫిర్యాదు

ఏపీ బీజేపీలో అసమ్మతి రోజు రోజుకు పెరుగుతోంది. కన్నా లక్ష్మీ నారాయణ నిష్క్రమణ తర్వాత కమలం పార్టీలోని అసమ్మతి వాదులంతా గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. సోము వీర్రాజు సంగతి తేల్చేయ్యాల్సిందేనని, ఆయన నాయకత్వంలో పనిచేయలేమని చెప్పేందుకు రెడీ అవుతున్నారు. వీర్రాజు, జీవీఎల్ సహా నలుగురు నేతల పెత్తందారీతనాన్ని భరించలేకపోతున్నామని బీజేపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.

మంగళవారం మీటింగ్ కేన్సిల్

వీర్రాజుకు వ్యతిరేకంగా అసమ్మతి వాదులు మంగళవారం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంగతి ఎలాగో ఢిల్లీలోని అధిష్టానానికి చేరింది. ఏపీ వ్యవహారాలను చేసూ శివప్రకాష్ రంగంలోకి దిగి ఎలాంటి మీటింగులు పెట్టవద్దని, అలాంటి చర్యలతో పార్టీ పరువు దెబ్బతింటుందని అభ్యర్థించారు. దానితో రెబెల్స్ కాస్త మెత్తబడ్డారు. ఈ నెల 26న ఢిల్లీ రావాలనే కూడా అసమ్మతి వాదులకు వర్తమానం అందింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడుకుందామని ఆయన సూచించారు..

నివేదక సిద్ధం…

వీర్రాజుకు వ్యతిరేకంగా నివేదిక సిద్ధం చేసేందుకు కూడా అసమ్మతి వాదులు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వారంతా టెలీ కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్నారు. అందరూ చర్చించుకుని రిపోర్టు సిద్ధం చేయబోతున్నారు. కన్నా నిష్క్రమణకు దారి తీసిన పరిణామాలు కూడా అందులో వివరించనున్నారు. అధికార పార్టీ తప్పిదాలను ఎండగడుతూ బీజేపీని అభివృద్ధి చేయాల్సిన తరుణంలో కొంత మంది నేతలు వేసీపీతో కలిసిపోయి సొంత పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించనున్నారు. అరడజను మంది జిల్లా అధ్యక్షులను వీర్రాజు తొలగించిన తీరు కూడా ప్రస్తావించబోతున్నారు.

అవినీతి ఆరోపణలు

సోము వీర్రాజుపై వస్తున్న అవినీతి ఆరోపణలను కూడా అసమ్మతి వాదులు అధిష్టానం దృష్టికి తీసుకురాబోతున్నారు. వైసీపీ అండతో వీర్రాజు కొన్ని అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ప్రయోజనాలను ఆశించే వీర్రాజు, వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్నది పార్టీలో పలువురి వాదన. మరి ఈ నెల 26న నడ్డా ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారో చూడాలి…

This post was last modified on February 22, 2023 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

13 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

56 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago