కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్లో ఉన్నట్లుండి రైజ్ అయిన యువ నటుడు. కెరీర్లో ఒక దశ వరకు చిన్న స్థాయి సినిమాలే చేశాడు కానీ.. గత ఏడాది అతడి పేరు మార్మోగిపోయింది. హార్రర్ కామెడీ ఫిల్మ్ ‘భూల్ భూలయియా-2’తో అతను పెద్ద హిట్టే కొట్టాడు.
కార్తీక్ రేంజికి ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడితే ఎక్కువ అనుకున్నారు. కానీ కొవిడ్ స్లంప్ నుంచి తేరుకోలేక సతమతం అవుతున్న బాలీవుడ్కు ఈ సినిమా ఊపిరిలూదింది. ఫుల్ రన్లో ఏకంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలు చతికిలపడుతున్న టైంలో ఈ చిత్రం ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో కార్తీక్ను నెక్స్ సూపర్ స్టార్ అంటూ కీర్తించేశారు బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు. కానీ ఏడాది తిరిగేసరికి బాక్సాఫీస్ అతడి గాలి తీసేసింది. పెద్ద కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన కార్తీక్ తర్వాతి చిత్రం ‘షెజాదా’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం ఎదుర్కొంది.
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘షెజాదా’కు రీమేక్గా తెరకెక్కిన ‘షెజాదా’ పట్ల ఎందుకో ముందు నుంచి హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించలేదు. రిలీజ్ ముంగిట దీనికి అస్సలు బజ్ కనిపించలేదు. బాలీవుడ్లో సౌత్ రీమేక్లు బోల్తా కొడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. మధ్యలో ‘దృశ్యం-2’ బాగా ఆడిన నేపథ్యంలో ఇది కూడా అలాగే మ్యాజిక్ చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.
‘భూల్ భూలయియా-2’కు తొలి రోజు రూ.15 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వస్తే దీని డే-1 కలెక్షన్లు 6 కోట్లకు మించలేదు. వీకెండ్ అయ్యేసరికి సినిమా రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దగ్గర నిలిచింది. సోమవారం నుంచి సినిమాను అస్సలు పట్టంచుకోవట్లేదు ప్రేక్షకులు.
ఇక రాబోయే వసూళ్లు నామమాత్రం అని అర్థమవుతోంది. వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ పెట్టినా సరే.. వసూళ్లు ఇంత తక్కువగా రావడం చూసి ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోతున్నారు. 200 కోట్ల హీరో తర్వాతి సినిమాకు 20 కోట్లకు పడిపోయాడేంటని కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on February 21, 2023 5:57 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…