2003లో వచ్చిన హృతిక్ రోషన్ సినిమా ‘కోయీ మిల్ గయా’లో బాల నటిగా కనిపించింది హన్సిక మొత్వాని. ఆ తర్వాత హిందీలోనే మరి కొన్ని చిత్రాల్లో చిన్న పిల్లగానే కనిపించింది. కానీ కొన్నేళ్లు తిరిగేసరికే.. 2007లో అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘దేశముదురు’ చిత్రంతో ఆమె హీరోయిన్ అయిపోయింది.
బాల నటిగా కెరీర్ మొదలుపెట్టిన నాలుగేళ్లకే ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోవడం చాలామందికి పెద్ద షాక్. ఐతే ఇంత వేగంగా బాల నటి నుంచి హీరోయిన్ అవ్వడానికి వైద్యురాలైన తన తల్లి సాయం తీసుకుందని అప్పట్లో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. హార్మోన్ ఇంజక్షన్లు తీసుకోవడం వల్లే ఆమె యువతిగా ట్రాన్స్ఫామ్ అయిందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. హార్మోన్ల ప్రభావంతో హన్సిక శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి.
ఐతే అప్పట్లో హన్సిక కానీ, ఆమె తల్లి కానీ ఈ వార్తల గురించి ఏమీ స్పందించలేదు. ఐతే ఇటీవలే సోహైల్ కథూరియా అనే తన స్నేహితుడినే పెళ్లి చేసుకుంది హన్సిక. ఆ వివాహ వేడుకకు సంబంధించి హాట్ స్టార్లో ప్రసారం అవుతున్న ‘లవ్ షాదీ డ్రామా’లో అప్పటి వార్తల గురించి హన్సిక, ఆమె తల్లి స్పందించారు. దీనిపై హన్సిక మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో నా గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే.
ఒక సెలబ్రెటీ అయినందుకు నేను విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. నాకు 21 ఏళ్ల వయసుండగా అలాంటి చెత్త వార్తలు రాశారు. అప్పట్లో అవి తీసుకుంటూ ఉంటే ఇప్పటికీ తీసుకుంటూ ఉండాలి. నేను ఎదగడానికి ఇంజక్షన్లు తీసుకున్నట్లు రాసి పారేశారు. పైగా నేను పెద్దదానిలా కనబడడం కోసం నా తల్లే స్వయంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చారని రాశారు’’ అని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయంపై హన్సిక తల్లి మాట్లాడుతూ.. తన కూతురికి అప్పట్లో హార్మన్ ఇంజక్షన్లు ఇవ్వాలంటే తాము టాటా, బిర్లాల కన్నా ధనవంతులమై ఉండాలని.. కనీసం మిలియనీర్ అయి ఉండాలని వ్యాఖ్యానించారు. తాము పంజాబీలమని.. తమ దగ్గర 12-16 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారని ఆమె అన్నారు.
This post was last modified on February 21, 2023 5:59 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…