2003లో వచ్చిన హృతిక్ రోషన్ సినిమా ‘కోయీ మిల్ గయా’లో బాల నటిగా కనిపించింది హన్సిక మొత్వాని. ఆ తర్వాత హిందీలోనే మరి కొన్ని చిత్రాల్లో చిన్న పిల్లగానే కనిపించింది. కానీ కొన్నేళ్లు తిరిగేసరికే.. 2007లో అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘దేశముదురు’ చిత్రంతో ఆమె హీరోయిన్ అయిపోయింది.
బాల నటిగా కెరీర్ మొదలుపెట్టిన నాలుగేళ్లకే ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోవడం చాలామందికి పెద్ద షాక్. ఐతే ఇంత వేగంగా బాల నటి నుంచి హీరోయిన్ అవ్వడానికి వైద్యురాలైన తన తల్లి సాయం తీసుకుందని అప్పట్లో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. హార్మోన్ ఇంజక్షన్లు తీసుకోవడం వల్లే ఆమె యువతిగా ట్రాన్స్ఫామ్ అయిందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. హార్మోన్ల ప్రభావంతో హన్సిక శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి.
ఐతే అప్పట్లో హన్సిక కానీ, ఆమె తల్లి కానీ ఈ వార్తల గురించి ఏమీ స్పందించలేదు. ఐతే ఇటీవలే సోహైల్ కథూరియా అనే తన స్నేహితుడినే పెళ్లి చేసుకుంది హన్సిక. ఆ వివాహ వేడుకకు సంబంధించి హాట్ స్టార్లో ప్రసారం అవుతున్న ‘లవ్ షాదీ డ్రామా’లో అప్పటి వార్తల గురించి హన్సిక, ఆమె తల్లి స్పందించారు. దీనిపై హన్సిక మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో నా గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే.
ఒక సెలబ్రెటీ అయినందుకు నేను విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. నాకు 21 ఏళ్ల వయసుండగా అలాంటి చెత్త వార్తలు రాశారు. అప్పట్లో అవి తీసుకుంటూ ఉంటే ఇప్పటికీ తీసుకుంటూ ఉండాలి. నేను ఎదగడానికి ఇంజక్షన్లు తీసుకున్నట్లు రాసి పారేశారు. పైగా నేను పెద్దదానిలా కనబడడం కోసం నా తల్లే స్వయంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చారని రాశారు’’ అని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయంపై హన్సిక తల్లి మాట్లాడుతూ.. తన కూతురికి అప్పట్లో హార్మన్ ఇంజక్షన్లు ఇవ్వాలంటే తాము టాటా, బిర్లాల కన్నా ధనవంతులమై ఉండాలని.. కనీసం మిలియనీర్ అయి ఉండాలని వ్యాఖ్యానించారు. తాము పంజాబీలమని.. తమ దగ్గర 12-16 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారని ఆమె అన్నారు.
This post was last modified on February 21, 2023 5:59 pm
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…
అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…
టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…
ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…
బంగారంతో పోటీ పడుతున్నట్టుగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోనే !. రాష్ట్ర పారిశ్రామిక,…
హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…