Mrunal Thakur
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆలస్యం చేయకుండా ఒక సినిమా లాగించేయాలని తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో జట్టు కట్టాడు రామ్ చరణ్. పక్కా ప్లానింగ్తోనే రంగంలోకి దిగాడు కానీ.. ఆ ప్లాన్ కొన్ని కారణాల వల్ల అనుకున్నట్లుగా అమలు కాలేదు. శంకర్కు అనుకోకుండా ఇండియన్-2 కమిట్మెంట్ పడడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోంది. దీని వల్ల చరణ్ సినిమా ఆగి ఆగి నడుస్తోంది.
ఈలోపు మెగా పవర్ స్టార్.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కథానాయిక ఖరారైపోయింది. సీతారామం సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. ఈ చిత్రంలో రామ్ చరణ్తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం.
సీతారామం తర్వాత తెలుగు నుంచి చాలామంది సంప్రదించినా.. సినిమాల ఎంపికలో మృణాల్ తొందరపడలేదు. టైం తీసుకుని నాని కొత్త సినిమా మాత్రమే ఒప్పుకుంది. ఆ తర్వాత ఆమె ఓకే చేసింది రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రాన్ని మాత్రమే. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించడంతో ఇక అతడి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనున్నాయి. బుచ్చిబాబు సినిమా కూడా అంతే. ఇలాంటి భారీ చిత్రంలో నటిస్తే కెరీర్కు చాలా ప్లస్ అవుతుందని మృణాల్ వెంటనే ఈ చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది.
చరణ్-మృణాల్ జోడీ చూడముచ్చటగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు అనే కొత్త నిర్మాత వృద్ధి సినిమాస్ బేనర్ మీద నిర్మించనున్నారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతటినీ సెట్ చేసుకుని ఈ వేసవిలో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని బుచ్చిబాబు అండ్ టీం ప్రణాళికలు రచిస్తోంది.
This post was last modified on February 20, 2023 6:21 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…