‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆలస్యం చేయకుండా ఒక సినిమా లాగించేయాలని తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో జట్టు కట్టాడు రామ్ చరణ్. పక్కా ప్లానింగ్తోనే రంగంలోకి దిగాడు కానీ.. ఆ ప్లాన్ కొన్ని కారణాల వల్ల అనుకున్నట్లుగా అమలు కాలేదు. శంకర్కు అనుకోకుండా ఇండియన్-2 కమిట్మెంట్ పడడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోంది. దీని వల్ల చరణ్ సినిమా ఆగి ఆగి నడుస్తోంది.
ఈలోపు మెగా పవర్ స్టార్.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కథానాయిక ఖరారైపోయింది. సీతారామం సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. ఈ చిత్రంలో రామ్ చరణ్తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం.
సీతారామం తర్వాత తెలుగు నుంచి చాలామంది సంప్రదించినా.. సినిమాల ఎంపికలో మృణాల్ తొందరపడలేదు. టైం తీసుకుని నాని కొత్త సినిమా మాత్రమే ఒప్పుకుంది. ఆ తర్వాత ఆమె ఓకే చేసింది రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రాన్ని మాత్రమే. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించడంతో ఇక అతడి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనున్నాయి. బుచ్చిబాబు సినిమా కూడా అంతే. ఇలాంటి భారీ చిత్రంలో నటిస్తే కెరీర్కు చాలా ప్లస్ అవుతుందని మృణాల్ వెంటనే ఈ చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది.
చరణ్-మృణాల్ జోడీ చూడముచ్చటగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు అనే కొత్త నిర్మాత వృద్ధి సినిమాస్ బేనర్ మీద నిర్మించనున్నారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతటినీ సెట్ చేసుకుని ఈ వేసవిలో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని బుచ్చిబాబు అండ్ టీం ప్రణాళికలు రచిస్తోంది.
This post was last modified on February 20, 2023 6:21 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…