గత ఏడాది ‘ఖుషి’ సినిమా షూటింగ్ చాలా ఉత్సాహంగా మొదలుపెట్టి.. చకచకా కొన్ని షెడ్యూళ్లు లాగించేసింది చిత్ర బృందం. చూస్తుండగానే 60 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. కానీ ఇంతలో హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ ప్రమోషన్ల కోసం పక్కకు వెళ్లాడు. అతను తిరిగొచ్చేసరికి హీరోయిన్ సమంత అనారోగ్యం బారిన పడింది. ఇక అంతే.. షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది చిత్ర బృందం.
ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలు నెలలు గడిచిపోయాయి. సినిమా రిలీజ్ కూడా నిరవధికంగా వాయిదా పడిపోయింది. సమంత అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి షూటింగ్కు హాజరయ్యే స్థితిలో ఉన్నా ‘ఖుషి’ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టలేదు. ముందు హిందీ వెబ్ సిరీస్ షూట్కే హాజరైంది. దీంతో ‘ఖుషి’ మీద నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లు, ముఖ్యంగా విజయ్ అభిమానులు నిరాశలో పడిపోయారు. ఐతే తాజా సమాచారం ప్రకారం సమంత అతి త్వరలోనే ‘ఖుషి’ షూట్కు హాజరు కానుందని సమాచారం. సమంత అనారోగ్యం నుంచి కోలుకున్నాక వెంటనే ‘ఖుషి’ షూటింగ్కు రాకపోవడానికి వేరే కారణం కూడా ఉన్నట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయి ప్రేమకథ. ఇందులో హీరో హీరోయిన్ల లుక్స్ చాలా కీలకం. కథానాయిక అందంగా, మంచి ఫీల్తో కనిపించాలి.
ఐతే మయోసైటిస్ నుంచి కోలుకున్నప్పటికీ.. సమంత ముఖంలో నీరసం పోలేదు. చాలా డల్లుగా, అలసటగా కనిపించింది. ఆ లుక్తో ‘ఖుషి’ షూట్కు హాజరైతే సినిమా ఫీల్ దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో సమంత ఆగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వర్కవుట్లతో పాటు థెరపీలు కూడా చేయించుకుంటున్నట్లు సమాచారం. మునుపటిలా ఆకర్షణీయంగా మారాక, ముఖంలో కళ వచ్చాక ‘ఖుషి’ షూటింగ్కు ఆమె హాజరు కానుందట. అది కొన్ని రోజుల్లోనే సాధ్యమవుతుందని.. మార్చి ఆరంభంలోనే ‘ఖుషి’ తిరిగి పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on February 18, 2023 10:28 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…