గత ఏడాది ‘ఖుషి’ సినిమా షూటింగ్ చాలా ఉత్సాహంగా మొదలుపెట్టి.. చకచకా కొన్ని షెడ్యూళ్లు లాగించేసింది చిత్ర బృందం. చూస్తుండగానే 60 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. కానీ ఇంతలో హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ ప్రమోషన్ల కోసం పక్కకు వెళ్లాడు. అతను తిరిగొచ్చేసరికి హీరోయిన్ సమంత అనారోగ్యం బారిన పడింది. ఇక అంతే.. షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది చిత్ర బృందం.
ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలు నెలలు గడిచిపోయాయి. సినిమా రిలీజ్ కూడా నిరవధికంగా వాయిదా పడిపోయింది. సమంత అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి షూటింగ్కు హాజరయ్యే స్థితిలో ఉన్నా ‘ఖుషి’ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టలేదు. ముందు హిందీ వెబ్ సిరీస్ షూట్కే హాజరైంది. దీంతో ‘ఖుషి’ మీద నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లు, ముఖ్యంగా విజయ్ అభిమానులు నిరాశలో పడిపోయారు. ఐతే తాజా సమాచారం ప్రకారం సమంత అతి త్వరలోనే ‘ఖుషి’ షూట్కు హాజరు కానుందని సమాచారం. సమంత అనారోగ్యం నుంచి కోలుకున్నాక వెంటనే ‘ఖుషి’ షూటింగ్కు రాకపోవడానికి వేరే కారణం కూడా ఉన్నట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయి ప్రేమకథ. ఇందులో హీరో హీరోయిన్ల లుక్స్ చాలా కీలకం. కథానాయిక అందంగా, మంచి ఫీల్తో కనిపించాలి.
ఐతే మయోసైటిస్ నుంచి కోలుకున్నప్పటికీ.. సమంత ముఖంలో నీరసం పోలేదు. చాలా డల్లుగా, అలసటగా కనిపించింది. ఆ లుక్తో ‘ఖుషి’ షూట్కు హాజరైతే సినిమా ఫీల్ దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో సమంత ఆగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వర్కవుట్లతో పాటు థెరపీలు కూడా చేయించుకుంటున్నట్లు సమాచారం. మునుపటిలా ఆకర్షణీయంగా మారాక, ముఖంలో కళ వచ్చాక ‘ఖుషి’ షూటింగ్కు ఆమె హాజరు కానుందట. అది కొన్ని రోజుల్లోనే సాధ్యమవుతుందని.. మార్చి ఆరంభంలోనే ‘ఖుషి’ తిరిగి పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on February 18, 2023 10:28 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…