Movie News

సమంతకు ‘లవర్’ లుక్ రాగానే..


గత ఏడాది ‘ఖుషి’ సినిమా షూటింగ్ చాలా ఉత్సాహంగా మొదలుపెట్టి.. చకచకా కొన్ని షెడ్యూళ్లు లాగించేసింది చిత్ర బృందం. చూస్తుండగానే 60 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. కానీ ఇంతలో హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ ప్రమోషన్ల కోసం పక్కకు వెళ్లాడు. అతను తిరిగొచ్చేసరికి హీరోయిన్ సమంత అనారోగ్యం బారిన పడింది. ఇక అంతే.. షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది చిత్ర బృందం.

ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలు నెలలు గడిచిపోయాయి. సినిమా రిలీజ్ కూడా నిరవధికంగా వాయిదా పడిపోయింది. సమంత అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‌కు హాజరయ్యే స్థితిలో ఉన్నా ‘ఖుషి’ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టలేదు. ముందు హిందీ వెబ్ సిరీస్ షూట్‌కే హాజరైంది. దీంతో ‘ఖుషి’ మీద నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లు, ముఖ్యంగా విజయ్ అభిమానులు నిరాశలో పడిపోయారు. ఐతే తాజా సమాచారం ప్రకారం సమంత అతి త్వరలోనే ‘ఖుషి’ షూట్‌కు హాజరు కానుందని సమాచారం. సమంత అనారోగ్యం నుంచి కోలుకున్నాక వెంటనే ‘ఖుషి’ షూటింగ్‌కు రాకపోవడానికి వేరే కారణం కూడా ఉన్నట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయి ప్రేమకథ. ఇందులో హీరో హీరోయిన్ల లుక్స్ చాలా కీలకం. కథానాయిక అందంగా, మంచి ఫీల్‌తో కనిపించాలి.

ఐతే మయోసైటిస్ నుంచి కోలుకున్నప్పటికీ.. సమంత ముఖంలో నీరసం పోలేదు. చాలా డల్లుగా, అలసటగా కనిపించింది. ఆ లుక్‌తో ‘ఖుషి’ షూట్‌కు హాజరైతే సినిమా ఫీల్ దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో సమంత ఆగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వర్కవుట్లతో పాటు థెరపీలు కూడా చేయించుకుంటున్నట్లు సమాచారం. మునుపటిలా ఆకర్షణీయంగా మారాక, ముఖంలో కళ వచ్చాక ‘ఖుషి’ షూటింగ్‌కు ఆమె హాజరు కానుందట. అది కొన్ని రోజుల్లోనే సాధ్యమవుతుందని.. మార్చి ఆరంభంలోనే ‘ఖుషి’ తిరిగి పట్టాలెక్కుతుందని అంటున్నారు.

This post was last modified on February 18, 2023 10:28 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

6 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

6 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

8 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

8 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

8 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

10 hours ago