Movie News

తండ్రీ కొడుకుల యుద్ధం రానా నాయుడు

దగ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రానా నాయుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హైదరాబాద్ నుంచి తెలుగు మీడియాని ఆహ్వానించి మరీ తమ ప్రత్యేకత చూపుకుంది నిర్మాణ బృందం. ఒక పెద్ద సినిమాకయ్యేంత ఖర్చు దీనికి పెట్టారని టీజర్ నుంచే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. వెంకటేష్ రానాల తొలి ఫుల్ లెన్త్ కలయిక కావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. దానికి తగ్గట్టే వీడియోని కట్ చేశారు

సినీ పరిశ్రమలోనే కాదు ఏ సెలబ్రిటీకి ఎలాంటి సమస్య వచ్చినా అందరికీ గుర్తొచ్చే పేరు రానా(రానా). తనను నమ్మి కాంట్రాక్టు ఇచ్చిన వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా సరే చేసేందుకు సిద్ధపడతాడు. ఈ క్రమంలో నేరాలతో నిండి ఉన్న చీకటి ప్రపంచంలో పెద్ద గుర్తింపు తెచ్చుకుంటాడు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవించిన నాగా(వెంకటేష్) బయటికి వస్తాడు. అతనెవరో కాదు స్వయానా రానా తండ్రి. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. విపరీతమైన ద్వేషంతో రగిలిపోయే రానా ఏం చేశాడనేది అసలు స్టోరీ.

కథేంటో స్పష్టంగా చెప్పేశారు. విజువల్స్ అన్నీ బాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్నాయి. ఇది హిందీలో తీసిన వెర్షన్. తెలుగులో డబ్బింగ్ చేశారని లిప్ సింక్ చూస్తే అర్థమైపోతుంది. జాన్ స్టీవర్ట్ ఏడూరి సంగీతం సమకూర్చగా మొత్తం నలుగురు రచయితలు ఈ స్క్రిప్ట్ మీద పని చేశారు. కరణ్ అంశుమన్ – సుపర్న్ ఎస్ వర్మ టేకింగ్ ఆసక్తికరంగా సాగింది. ఏ మార్కు సీన్లు జోకులు కుడా ఉన్నాయి. వెంకీ మామని ఇంత హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో చూసి చాలా కాలమయ్యింది. పైగా నెగటివ్ షేడ్స్ కూడా జోడించడంతో క్యారెక్టరైజేషన్ ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి బాబాయ్ అబ్బాయ్ లు ఏదో గట్టి ప్లాన్ తోనే వస్తున్నారు.

This post was last modified on February 15, 2023 10:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

16 seconds ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago