పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దశాబ్దం కిందటే విడిపోయినప్పటికీ.. రేణు దేశాయ్ తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సినిమాలకు దూరం అయినప్పటికీ.. టీవీ షోలు, ఇంటర్వ్యూల ద్వారా ఆమె జనాలను ఏదో రకంగా పలకరిస్తూనే ఉంది.
పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఏం మాట్లాడినా ఆయన అభిమానులతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా గమనిస్తారు. రేణు వ్యక్తిగత విషయాల మీద కూడా అమితాసక్తిని ప్రదర్శిస్తారు.
తాజాగా ఆమె తాను అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు వెల్లడించడం అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. తాను గుండె సంబంధిత సమస్యతో పాటు వేరే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా రేణు ఈ విషయాన్ని బయటపెట్టింది.
‘‘అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను కొన్నేళ్లుగా గుండె సంబంధిత సమస్య, మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నాననంటే.. నాలా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికి, వారిలో పాజిటివిటీ పెంచడానికే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకూడదు. ఎప్పుడూ బలంగా ఉండాలి. అలా ఉంటే ఎప్పటికైనా సానుకూల ఫలితం వస్తుంది. మీపై, మీ జీవితంపై ఆశలు కోల్పోవద్దు. ఈ విశ్వం మన కోసం ఎన్నో అద్భుతాలను దాచి ఉంచింది. ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలి’’ అని రేణు తెలిపింది. ప్రస్తుతం తాను అనారోగ్యానికి చికిత్స పొందుతూనే యోగా చేస్తున్నానని.. మందులు, పోషకాహారం తీసుకుంటున్నానని చెప్పిన రేణు. త్వరలోనే మామూలు స్థితికి చేరుకుని తిరిగి కెమెరా ముందుకు రావాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది.
This post was last modified on February 15, 2023 3:19 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…