ప్రమోషన్ల పేరుతో మరీ అతి చేస్తే.. అసంబద్ధమైన ఆలోచనల్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తే ఎలా బూమరాంగ్ అవుతుందో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఇప్పుడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారిని కాన్సెప్ట్ బాగానే ఆకర్షించింది. మన ఇళ్లకు అటు ఇటు ఉన్న వాళ్లను నెయ్బర్స్ అన్నట్లే.. మన ఫోన్ నంబర్కు ఇటు ఇటు ఉన్న వాళ్లను కూడా ఫోన్ నంబర్ నెయ్బర్స్ అనొచ్చని.. వాళ్లతో పరిచయం జరిగి స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది.
ఐతే సినిమాలో ఈ కాన్సెప్ట్ ఓకే కానీ.. నిజ జీవితంలో ఇలా ఫోన్ నంబర్ నెయ్బర్స్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రమోషన్లు మొదలుపెట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ విషయాన్ని జనాలకు చేరవేసే విషయంలో అతను కొంచెం అతిగానే మాట్లాడాడు. మన పక్క ఫోన్ నంబర్లు ఉన్న వాళ్లు కూడా మనకు సాయం చేయొచ్చని.. కాబట్టి వాళ్లకు ఫోన్ చేసి స్నేహం చేయండని అతను పిలుపునిచ్చాడు. అంతా చెప్పి చివర్లో దీన్ని చెడుకు వాడొద్దని కూడా అన్నాడు.
కానీ ఈ అప్పీల్ అల్లరి కుర్రాళ్లకు మంచి వ్యాపకంగా మారినట్లుంది. ఇటు అటు నంబర్లకు ఫోన్ చేయడం.. అందులో అమ్మాయిలు ఉంటే వారిని ఫ్రెండ్షిప్ పేరుతో వేధించడం లాంటివి చేస్తున్నట్లున్నారు. దీంతో అలా ఇబ్బంది ఎదుర్కొన్న అమ్మాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏంటీ నాన్సెన్స్ అని. కొందరు అబ్బాయిలు కూడా ఇదేం నస అంటూ చిరాకు పడుతున్నారు.
మొత్తంగా చూస్తే ఈ కాన్సెప్ట్ బూమరాంగ్ అయినట్లే ఉంది. కిరణ్ మీద మండిపడుతూ.. ఈ చెత్త కాన్సెప్ట్ ప్రమోషన్లను కట్టి పెట్టాలని.. వెంటనే ఆ పోస్టును డెలీట్ చేయాలని అతడి మీద మండి పడుతున్నారు. రోజు రోజుకూ కిరణ్ మీద విమర్శలు పెరుగుతున్నాయి. చివరికి ఈ ప్రమోషన్ బూమరాంగ్ అయి సినిమాకు చేటు చేస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on February 11, 2023 2:26 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…