ప్రమోషన్ల పేరుతో మరీ అతి చేస్తే.. అసంబద్ధమైన ఆలోచనల్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తే ఎలా బూమరాంగ్ అవుతుందో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఇప్పుడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారిని కాన్సెప్ట్ బాగానే ఆకర్షించింది. మన ఇళ్లకు అటు ఇటు ఉన్న వాళ్లను నెయ్బర్స్ అన్నట్లే.. మన ఫోన్ నంబర్కు ఇటు ఇటు ఉన్న వాళ్లను కూడా ఫోన్ నంబర్ నెయ్బర్స్ అనొచ్చని.. వాళ్లతో పరిచయం జరిగి స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది.
ఐతే సినిమాలో ఈ కాన్సెప్ట్ ఓకే కానీ.. నిజ జీవితంలో ఇలా ఫోన్ నంబర్ నెయ్బర్స్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రమోషన్లు మొదలుపెట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ విషయాన్ని జనాలకు చేరవేసే విషయంలో అతను కొంచెం అతిగానే మాట్లాడాడు. మన పక్క ఫోన్ నంబర్లు ఉన్న వాళ్లు కూడా మనకు సాయం చేయొచ్చని.. కాబట్టి వాళ్లకు ఫోన్ చేసి స్నేహం చేయండని అతను పిలుపునిచ్చాడు. అంతా చెప్పి చివర్లో దీన్ని చెడుకు వాడొద్దని కూడా అన్నాడు.
కానీ ఈ అప్పీల్ అల్లరి కుర్రాళ్లకు మంచి వ్యాపకంగా మారినట్లుంది. ఇటు అటు నంబర్లకు ఫోన్ చేయడం.. అందులో అమ్మాయిలు ఉంటే వారిని ఫ్రెండ్షిప్ పేరుతో వేధించడం లాంటివి చేస్తున్నట్లున్నారు. దీంతో అలా ఇబ్బంది ఎదుర్కొన్న అమ్మాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏంటీ నాన్సెన్స్ అని. కొందరు అబ్బాయిలు కూడా ఇదేం నస అంటూ చిరాకు పడుతున్నారు.
మొత్తంగా చూస్తే ఈ కాన్సెప్ట్ బూమరాంగ్ అయినట్లే ఉంది. కిరణ్ మీద మండిపడుతూ.. ఈ చెత్త కాన్సెప్ట్ ప్రమోషన్లను కట్టి పెట్టాలని.. వెంటనే ఆ పోస్టును డెలీట్ చేయాలని అతడి మీద మండి పడుతున్నారు. రోజు రోజుకూ కిరణ్ మీద విమర్శలు పెరుగుతున్నాయి. చివరికి ఈ ప్రమోషన్ బూమరాంగ్ అయి సినిమాకు చేటు చేస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…