తన అన్నయ్య చిరంజీవి పేరెత్తితే చాలు ఎమోషనల్ అయిపోతుంటాడు పవన్ కళ్యాణ్. తన జీవితంలో ప్రతి మంచికీ చిరునే కారణం అని అంటుంటాడు. ఐతే పవన్ అంతగా ఇష్టపడే చిరులో తనకు నచ్చని విషయాలేమీ లేవా? అంటే.. కాదని అనలేదు పవర్ స్టార్. అన్నయ్యలో తనకు నచ్చిన విషయాలతో పాటు నచ్చని విషయం గురించి కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ షోలో పవన్ వెల్లడించాడు. తన ఎపిసోడ్ తాలూకు రెండో భాగంలో పవన్ దీని గురించి మాట్లాడాడు.
ఒళ్లు దాచుకోకుండా కష్టపడే తత్వాన్ని తన అన్నయ్య నుంచే తాను నేర్చుకున్నానని.. అలాగే రాజకీయాల్లో విమర్శలను కచ్చితంగా స్వీకరించాలని.. దేన్నయినా భరించాలని కూడా ఆయన్నుంచే తెలుసుకున్నానని పవన్ తెలిపాడు.
అయితే తన అన్నయ్యలో తనకు నచ్చనిది, ఆయన్నుంచి స్వీకరించని ఒకటే ఉందని.. అదే మొహమాటం అని పవన్ తేల్చేశాడు. చిరుకు మొహమాటం ఎక్కువ అని, ఎవరినీ ఏమీ అనలేరని, నొప్పించలేరని పవన్ వ్యాఖ్యానించాడు. పవన్ మాత్రమే కాదు.. మెగా అభిమానులందరూ కూడా చిరు విషయంలో వ్యక్తం చేసే అభ్యంతరం ఇదే. ప్రతి ఒక్కరినీ మెప్పించాలనే క్రమంలో.. పవన్ను అనరాని మాటలు అనే రాజకీయ ప్రత్యర్థులతో కూడా చిరు సన్నిహితంగా మెలగడం, వారి గురించి పాజిటివ్గా మాట్లాడ్డం అభిమానులకు రుచించదు.
ఇక తాను రాజకీయాల్లోకి ఎలా వచ్చానో పవన్ వివరిస్తూ.. “నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని రక్షిత మంచినీరు అందించాలని ప్రయత్నించా. కానీ స్థానిక రాజకీయ గ్రూపులు అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులేంటో అర్థం కాలేదు. తర్వాత ఎన్జీవో మొదలుపెట్టాలనుకున్నా. కానీ నా ఆలోచన పరిధికి అది సరిపోదనిపించింది. ఇంకా పెద్దగా ఏదో చేయాలని రాజకీయ పార్టీ పెట్టా” అని చెప్పాడు.
This post was last modified on February 10, 2023 12:20 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…