Movie News

బాలయ్య మిస్సయిన బ్లాక్ బస్టర్ ఇదే !

కొన్ని కథలు ఒక హీరో దగ్గరికి వెళ్లి, ఫైనల్ గా మరో హీరో చేతికి చిక్కుతాయి. రెండేళ్ల క్రితం థియేటర్స్ లోకి సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన రవితేజ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ వెనుక కూడా మరో హీరో ఉన్నాడు. ఆయనే బాలయ్య. అవును గోపీచంద్ మలినేని ముందుగా క్రాక్ కథను బాలయ్యతోనే చేయాలని అనుకున్నాడట. సి. కళ్యాణ్ నిర్మాణంలో ప్రాజెక్ట్ అనుకొని ఫైనల్ గా ఆ టైమ్ లో బాలయ్య బిజీగా ఉండటం వల్ల రవితేజకి చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడట. ఇక హీరోతో పాటు నిర్మాత కూడా మారాడు.

‘క్రాక్’ కథ ముందు బాలయ్య తో అనుకున్నామని గోపీచంద్ ఎక్కడా చెప్పింది లేదు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ బయటపెట్టాడు. కళ్యాణ్ నిర్మించిన ఓ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చాడు గోపీచంద్ మలినేని. గోపి గురించి కళ్యాణ్ మాట్లాడుతూ మా కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో కుదర్లేదని చెప్పుకున్నాడు. మొన్న సంక్రాంతికి బాలయ్యతో గోపీచంద్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ కాంబో సినిమా నేను చేయాల్సింది. కానీ అది మరొకరికి రాసి పెట్టి ఉంది.

బాలయ్య తో ఆ టైమ్ లో క్రాక్ కథ అనుకున్నాం. కానీ అప్పుడు బాలయ్య డేట్స్ కుదరకపోవడం మరో ప్రాజెక్ట్ తో బిజీ గా ఉండటం చేత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అలా బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమాను నేను మిస్సయ్యానని చెప్పాడు కళ్యాణ్. గోపీచంద్ మలినేని బాలయ్యతో క్రాక్ అనుకొని ఇప్పుడు వీర సింహా రెడ్డితో ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ రకంగా బాలయ్య క్రాక్ మిస్ అయ్యాడు. అయినా ఆ సినిమాతో రవితేజ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని రాసి ఉన్నప్పుడు బాలయ్య ఎలా చేస్తాడు ? ఈ విషయంలో అదే జరిగిందనుకోవచ్చు.

This post was last modified on February 10, 2023 7:46 am

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

6 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

7 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

7 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

8 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

8 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

8 hours ago