కొన్ని కథలు ఒక హీరో దగ్గరికి వెళ్లి, ఫైనల్ గా మరో హీరో చేతికి చిక్కుతాయి. రెండేళ్ల క్రితం థియేటర్స్ లోకి సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన రవితేజ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ వెనుక కూడా మరో హీరో ఉన్నాడు. ఆయనే బాలయ్య. అవును గోపీచంద్ మలినేని ముందుగా క్రాక్ కథను బాలయ్యతోనే చేయాలని అనుకున్నాడట. సి. కళ్యాణ్ నిర్మాణంలో ప్రాజెక్ట్ అనుకొని ఫైనల్ గా ఆ టైమ్ లో బాలయ్య బిజీగా ఉండటం వల్ల రవితేజకి చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడట. ఇక హీరోతో పాటు నిర్మాత కూడా మారాడు.
‘క్రాక్’ కథ ముందు బాలయ్య తో అనుకున్నామని గోపీచంద్ ఎక్కడా చెప్పింది లేదు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ బయటపెట్టాడు. కళ్యాణ్ నిర్మించిన ఓ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చాడు గోపీచంద్ మలినేని. గోపి గురించి కళ్యాణ్ మాట్లాడుతూ మా కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో కుదర్లేదని చెప్పుకున్నాడు. మొన్న సంక్రాంతికి బాలయ్యతో గోపీచంద్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ కాంబో సినిమా నేను చేయాల్సింది. కానీ అది మరొకరికి రాసి పెట్టి ఉంది.
బాలయ్య తో ఆ టైమ్ లో క్రాక్ కథ అనుకున్నాం. కానీ అప్పుడు బాలయ్య డేట్స్ కుదరకపోవడం మరో ప్రాజెక్ట్ తో బిజీ గా ఉండటం చేత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అలా బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమాను నేను మిస్సయ్యానని చెప్పాడు కళ్యాణ్. గోపీచంద్ మలినేని బాలయ్యతో క్రాక్ అనుకొని ఇప్పుడు వీర సింహా రెడ్డితో ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ రకంగా బాలయ్య క్రాక్ మిస్ అయ్యాడు. అయినా ఆ సినిమాతో రవితేజ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని రాసి ఉన్నప్పుడు బాలయ్య ఎలా చేస్తాడు ? ఈ విషయంలో అదే జరిగిందనుకోవచ్చు.
This post was last modified on February 10, 2023 7:46 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…