కొన్ని కథలు ఒక హీరో దగ్గరికి వెళ్లి, ఫైనల్ గా మరో హీరో చేతికి చిక్కుతాయి. రెండేళ్ల క్రితం థియేటర్స్ లోకి సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన రవితేజ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ వెనుక కూడా మరో హీరో ఉన్నాడు. ఆయనే బాలయ్య. అవును గోపీచంద్ మలినేని ముందుగా క్రాక్ కథను బాలయ్యతోనే చేయాలని అనుకున్నాడట. సి. కళ్యాణ్ నిర్మాణంలో ప్రాజెక్ట్ అనుకొని ఫైనల్ గా ఆ టైమ్ లో బాలయ్య బిజీగా ఉండటం వల్ల రవితేజకి చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడట. ఇక హీరోతో పాటు నిర్మాత కూడా మారాడు.
‘క్రాక్’ కథ ముందు బాలయ్య తో అనుకున్నామని గోపీచంద్ ఎక్కడా చెప్పింది లేదు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ బయటపెట్టాడు. కళ్యాణ్ నిర్మించిన ఓ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చాడు గోపీచంద్ మలినేని. గోపి గురించి కళ్యాణ్ మాట్లాడుతూ మా కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో కుదర్లేదని చెప్పుకున్నాడు. మొన్న సంక్రాంతికి బాలయ్యతో గోపీచంద్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ కాంబో సినిమా నేను చేయాల్సింది. కానీ అది మరొకరికి రాసి పెట్టి ఉంది.
బాలయ్య తో ఆ టైమ్ లో క్రాక్ కథ అనుకున్నాం. కానీ అప్పుడు బాలయ్య డేట్స్ కుదరకపోవడం మరో ప్రాజెక్ట్ తో బిజీ గా ఉండటం చేత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అలా బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమాను నేను మిస్సయ్యానని చెప్పాడు కళ్యాణ్. గోపీచంద్ మలినేని బాలయ్యతో క్రాక్ అనుకొని ఇప్పుడు వీర సింహా రెడ్డితో ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ రకంగా బాలయ్య క్రాక్ మిస్ అయ్యాడు. అయినా ఆ సినిమాతో రవితేజ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని రాసి ఉన్నప్పుడు బాలయ్య ఎలా చేస్తాడు ? ఈ విషయంలో అదే జరిగిందనుకోవచ్చు.
This post was last modified on February 10, 2023 7:46 am
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…