నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ప్లానింగ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ నుండి ఆమె బాలీవుడ్ వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం కమిట్ అయిన తెలుగు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది. ఇటీవల ముంబై లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది కూడా. అక్కడ సమంత ఫ్లాట్ కొన్న విషయం బయటికి రాగానే తెలుగులో ఇకపై సినిమాల కౌంట్ తగ్గించబోతుందని అందరూ భావిస్తున్నారు.
ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ కి బాగా దగ్గరైంది సమంత. తాజాగా అక్కడ మరో సిరీస్ చేస్తుంది. హిందీలో రెండు సినిమాలు సైన్ చేసిందని టాక్ ఉంది. తెలుగులో ఖుషి తర్వాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. నెక్స్ లైనప్ అంతా హిందీలోనే ఉందనుందని తెలుస్తుంది. అలాగే తమిళ్ లో కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ లైనప్ లో పెట్టుకుందని సమాచారం.
చైతుని పెళ్ళాడి హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకున్న సమంత ఇప్పుడు ముంబై లోనే ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకుంటుందని ఇన్సైడ్ టాక్. మరి బాలీవుడ్ లో సామ్ బిజీ హీరోయిన్ అవుతుందా ? అనారోగ్యం నుండి ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది సామ్. ఇకపై తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టబోతుంది. త్వరలోనే ఖుషి షూట్ లో పాల్గొనబోతుంది. సామ్ కోసమే కొన్ని నెలలుగా బ్రేక్ పడిన ఈ సినిమా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ మొదటి వారం నుండి మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.
This post was last modified on February 9, 2023 12:24 pm
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…