నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ప్లానింగ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ నుండి ఆమె బాలీవుడ్ వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం కమిట్ అయిన తెలుగు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది. ఇటీవల ముంబై లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది కూడా. అక్కడ సమంత ఫ్లాట్ కొన్న విషయం బయటికి రాగానే తెలుగులో ఇకపై సినిమాల కౌంట్ తగ్గించబోతుందని అందరూ భావిస్తున్నారు.
ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ కి బాగా దగ్గరైంది సమంత. తాజాగా అక్కడ మరో సిరీస్ చేస్తుంది. హిందీలో రెండు సినిమాలు సైన్ చేసిందని టాక్ ఉంది. తెలుగులో ఖుషి తర్వాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. నెక్స్ లైనప్ అంతా హిందీలోనే ఉందనుందని తెలుస్తుంది. అలాగే తమిళ్ లో కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ లైనప్ లో పెట్టుకుందని సమాచారం.
చైతుని పెళ్ళాడి హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకున్న సమంత ఇప్పుడు ముంబై లోనే ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకుంటుందని ఇన్సైడ్ టాక్. మరి బాలీవుడ్ లో సామ్ బిజీ హీరోయిన్ అవుతుందా ? అనారోగ్యం నుండి ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది సామ్. ఇకపై తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టబోతుంది. త్వరలోనే ఖుషి షూట్ లో పాల్గొనబోతుంది. సామ్ కోసమే కొన్ని నెలలుగా బ్రేక్ పడిన ఈ సినిమా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ మొదటి వారం నుండి మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.
This post was last modified on February 9, 2023 12:24 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…