బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా మైలురాయి అందుకున్న వీరసింహారెడ్డి ఎనభై కోట్లకు పైగా షేర్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పందెంలో మొదటి స్థానం కాకపోయినా ఫలితం పట్ల అభిమానులు సంతోషంగానే ఉన్నారు. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే దీని షూటింగ్ టైంలో ఫ్యాక్షనిస్టుగా పెద్ద బాలయ్య గెటప్ చూసి ఇది అచ్చం కన్నడ మూవీ మఫ్టీలో శివ రాజ్ కుమార్ లాగే ఉందంటూ కొందరు ఫోటోలతో సహా సాక్ష్యాలు చూపించారు. ఏకంగా దాని రీమేకనే ప్రచారం కూడా జరిగింది. చొక్కా పంచె కలర్లు రెండిట్లో ఒకేలా ఉండటమే దీనికి కారణం. దీనికి క్లారిటీ వచ్చేసింది.
స్వయంగా బాలయ్యే కుండబద్దలు కొట్టారు. నిన్న జరిగిన వేద డబ్బింగ్ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వెళ్లి అందులో భాగంగా శివ రాజ్ కుమార్ తో అనుబంధం గురించి చెబుతూనే మఫ్టీ తనకు చాలా నచ్చిందని వీరసింహారెడ్డి పాత్రను దాన్ని చూసే తీర్చిదిద్దామని స్పష్టంగా చెప్పేశారు. అంటే గతంలో వచ్చిన పోలిక వెనుక కథ ఇదన్న మాట. మఫ్టీ మల్టీ స్టారర్. కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం హీరో శ్రీమురళితో పాటు శివరాజ్ కుమార్ నటించారు. అక్కడ ఘనవిజయం సాధించింది. అందులోనూ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. కానీ స్టోరీపరంగా డిఫరెంట్ స్టైల్ లో సాగుతుంది.
శాండల్ వుడ్ లో ఎంత గొప్ప పేరున్నా శివరాజ్ కుమార్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ ఎప్పుడూ చేయలేదు. కేవలం బాలయ్య అడిగారన్న కారణంగా గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథకుడిగా ఓ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. చాలాసార్లు పలు వేడుకల్లో బెంగళూరులో ఇద్దరూ కలుసుకున్న దాఖలాలున్నాయి. అంత బాండింగ్ ఉంది కాబట్టి మఫ్టీని స్ఫూర్తిగా తీసుకుని వీరసింహారెడ్డిని డిజైన్ చేశామని చెప్పడానికి బాలయ్య మొహమాటపడలేదు. నిజానికి ఆ కన్నడ సినిమాని ఇక్కడ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ కాంబో కుదరక మనోళ్లు లైట్ తీసుకున్నారు.
This post was last modified on February 8, 2023 1:02 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…