Political News

వైసీపీలో మ‌రో ఎమ్మెల్యే రెడీనా?

తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో పెరిగిపోతోంది. ఇటీవ‌లే నెల్లూరులో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నార‌నేవాద‌న పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి పాగా వేసిన వైసీపీలో వర్గ విభేదాలు మ‌రోసారి బయటపడ్డాయి. ఇక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మంత్రి జోగి రమేష్‌ మధ్య వర్గపోరు తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది.

వైసీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ దగ్గరకు మైలవరం పంచాయితీ చేరింది. గుంటూరులోని రాజశేఖర్ ఆఫీస్‌లో నేత‌ల‌ను కూర్చోబెట్టి పంచాయ‌తీ చేయాల‌ని మ‌ర్రి భావించారు. అయితే.. ఈ క్ర‌మంలో ర‌గ‌డ పెద్ద‌దై.. వైసీపీ నేతలు గొడవపడ్డారని తెలిసింది. మైలవరం నేతలను ఎమ్మెల్యే వసంత.. మర్రి రాజశేఖర్ దగ్గరకు పంపారు. ఎమ్మెల్యేపై మంత్రి రమేష్ అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.

అయితే.. మంత్రి జోగి రమేష్ త‌ర‌ఫున మ‌ర్రి వ‌ద్ద‌కు వ‌చ్చిన నాయ‌కులు త‌మ నేత‌పై ఎమ్మెల్యే వ‌సంత చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మర్రి రాజశేఖర్ ఎదుటే బాహాబాహీకి దిగారు. దీంతో ఈ పంచాయ‌తీ ఇక ఇప్ప‌ట్లో తెగేది కాద‌ని అంటున్నారు. ఇక‌, ఎమ్మెల్యే విష‌యానికి వ‌స్తే.. వ‌సంత కొన్నాళ్లుగా పార్టీపై గుస్సాగానే ఉన్నారు. గుంటూరులో జ‌రిగిన తొక్కిస లాట ఘ‌ట‌న‌లో ఎన్నారై ఉయ్యురు శ్రీనివాస రావును పోలీసులు అరెస్టు చేయ‌డం(త‌ర్వాత బెయిల్ వ‌చ్చింది) త‌గ‌ద‌ని మీడియా ముఖంగానే చెప్పారు.

అంతేకాదు.. అమ‌రావ‌తిని ఎలా నూ పోగొట్టుకున్నామ‌ని.. ఇప్పుడు సాయం చేసే ఎన్నారైల‌ను కూడా పోగొట్టుకుంటే.. ఎలా అని కూడా ఆయ‌న స్పందించారు. ఈ ప‌రిణామాలను పార్టీ అదిష్టానం తీవ్రంగానే భావిస్తోంది. దీంతో ప్ర‌స్తుతానికి పొమ్మ‌న కుండా.. పొగ పెట్టిన చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వ‌సంత కూడా త్వ‌ర‌లోనే త‌న దారి తాను చూసుకునేందుకు రెడీగా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 8, 2023 11:32 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

8 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

52 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago