Political News

వైసీపీలో మ‌రో ఎమ్మెల్యే రెడీనా?

తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో పెరిగిపోతోంది. ఇటీవ‌లే నెల్లూరులో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నార‌నేవాద‌న పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి పాగా వేసిన వైసీపీలో వర్గ విభేదాలు మ‌రోసారి బయటపడ్డాయి. ఇక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మంత్రి జోగి రమేష్‌ మధ్య వర్గపోరు తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది.

వైసీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ దగ్గరకు మైలవరం పంచాయితీ చేరింది. గుంటూరులోని రాజశేఖర్ ఆఫీస్‌లో నేత‌ల‌ను కూర్చోబెట్టి పంచాయ‌తీ చేయాల‌ని మ‌ర్రి భావించారు. అయితే.. ఈ క్ర‌మంలో ర‌గ‌డ పెద్ద‌దై.. వైసీపీ నేతలు గొడవపడ్డారని తెలిసింది. మైలవరం నేతలను ఎమ్మెల్యే వసంత.. మర్రి రాజశేఖర్ దగ్గరకు పంపారు. ఎమ్మెల్యేపై మంత్రి రమేష్ అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.

అయితే.. మంత్రి జోగి రమేష్ త‌ర‌ఫున మ‌ర్రి వ‌ద్ద‌కు వ‌చ్చిన నాయ‌కులు త‌మ నేత‌పై ఎమ్మెల్యే వ‌సంత చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మర్రి రాజశేఖర్ ఎదుటే బాహాబాహీకి దిగారు. దీంతో ఈ పంచాయ‌తీ ఇక ఇప్ప‌ట్లో తెగేది కాద‌ని అంటున్నారు. ఇక‌, ఎమ్మెల్యే విష‌యానికి వ‌స్తే.. వ‌సంత కొన్నాళ్లుగా పార్టీపై గుస్సాగానే ఉన్నారు. గుంటూరులో జ‌రిగిన తొక్కిస లాట ఘ‌ట‌న‌లో ఎన్నారై ఉయ్యురు శ్రీనివాస రావును పోలీసులు అరెస్టు చేయ‌డం(త‌ర్వాత బెయిల్ వ‌చ్చింది) త‌గ‌ద‌ని మీడియా ముఖంగానే చెప్పారు.

అంతేకాదు.. అమ‌రావ‌తిని ఎలా నూ పోగొట్టుకున్నామ‌ని.. ఇప్పుడు సాయం చేసే ఎన్నారైల‌ను కూడా పోగొట్టుకుంటే.. ఎలా అని కూడా ఆయ‌న స్పందించారు. ఈ ప‌రిణామాలను పార్టీ అదిష్టానం తీవ్రంగానే భావిస్తోంది. దీంతో ప్ర‌స్తుతానికి పొమ్మ‌న కుండా.. పొగ పెట్టిన చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వ‌సంత కూడా త్వ‌ర‌లోనే త‌న దారి తాను చూసుకునేందుకు రెడీగా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 8, 2023 11:32 am

Share
Show comments

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

22 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago