Political News

వైసీపీలో మ‌రో ఎమ్మెల్యే రెడీనా?

తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో పెరిగిపోతోంది. ఇటీవ‌లే నెల్లూరులో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నార‌నేవాద‌న పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి పాగా వేసిన వైసీపీలో వర్గ విభేదాలు మ‌రోసారి బయటపడ్డాయి. ఇక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మంత్రి జోగి రమేష్‌ మధ్య వర్గపోరు తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది.

వైసీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ దగ్గరకు మైలవరం పంచాయితీ చేరింది. గుంటూరులోని రాజశేఖర్ ఆఫీస్‌లో నేత‌ల‌ను కూర్చోబెట్టి పంచాయ‌తీ చేయాల‌ని మ‌ర్రి భావించారు. అయితే.. ఈ క్ర‌మంలో ర‌గ‌డ పెద్ద‌దై.. వైసీపీ నేతలు గొడవపడ్డారని తెలిసింది. మైలవరం నేతలను ఎమ్మెల్యే వసంత.. మర్రి రాజశేఖర్ దగ్గరకు పంపారు. ఎమ్మెల్యేపై మంత్రి రమేష్ అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.

అయితే.. మంత్రి జోగి రమేష్ త‌ర‌ఫున మ‌ర్రి వ‌ద్ద‌కు వ‌చ్చిన నాయ‌కులు త‌మ నేత‌పై ఎమ్మెల్యే వ‌సంత చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మర్రి రాజశేఖర్ ఎదుటే బాహాబాహీకి దిగారు. దీంతో ఈ పంచాయ‌తీ ఇక ఇప్ప‌ట్లో తెగేది కాద‌ని అంటున్నారు. ఇక‌, ఎమ్మెల్యే విష‌యానికి వ‌స్తే.. వ‌సంత కొన్నాళ్లుగా పార్టీపై గుస్సాగానే ఉన్నారు. గుంటూరులో జ‌రిగిన తొక్కిస లాట ఘ‌ట‌న‌లో ఎన్నారై ఉయ్యురు శ్రీనివాస రావును పోలీసులు అరెస్టు చేయ‌డం(త‌ర్వాత బెయిల్ వ‌చ్చింది) త‌గ‌ద‌ని మీడియా ముఖంగానే చెప్పారు.

అంతేకాదు.. అమ‌రావ‌తిని ఎలా నూ పోగొట్టుకున్నామ‌ని.. ఇప్పుడు సాయం చేసే ఎన్నారైల‌ను కూడా పోగొట్టుకుంటే.. ఎలా అని కూడా ఆయ‌న స్పందించారు. ఈ ప‌రిణామాలను పార్టీ అదిష్టానం తీవ్రంగానే భావిస్తోంది. దీంతో ప్ర‌స్తుతానికి పొమ్మ‌న కుండా.. పొగ పెట్టిన చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వ‌సంత కూడా త్వ‌ర‌లోనే త‌న దారి తాను చూసుకునేందుకు రెడీగా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

25 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago